
📌 Key Points
- ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ ఆలయం ఉంది.
- అమ్మవారికి ఐదు రాళ్లు, ఒక పువ్వు సమర్పించడం ఆనవాయితీ.
- ఆలయం దట్టమైన అడవుల మధ్య కొలువై ఉంది.
- భక్తుడి నిష్కల్మషమైన ప్రేమకు అమ్మవారు మెచ్చి వరం ఇచ్చారు.
భారతదేశంలో ఎన్నో శక్తి పీఠాలు ఉన్నాయి. ఒక్కో శక్తి పీఠానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బాగదాయి అమ్మవారి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాగదాయి అమ్మవారి ఆలయ స్థల పురాణం
అమ్మవారికి ఎవరైనా పట్టువస్త్రాలు, మెుక్కుకుంటే బంగారంలాంటివి సమర్పిస్తారు. కానీ మా బాగదాయి అమ్మవారికి ఐదు రాళ్లు, పువ్వు సమర్పిస్తే చాలు.
భారతదేశవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పండ్లు లేదా నైవేద్యాలు సమర్పించడం మనం చూస్తుంటాం. కానీ ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా, దట్టమైన అడవుల మధ్య కొలువై ఉన్న మా బాగదాయి ఆలయం వీటన్నింటికీ భిన్నం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అమ్మవారికి సమర్పించేది కేవలం ఐదు రాళ్లు, ఒక పువ్వు మాత్రమే!
ఐదు రాళ్ల ప్రాముఖ్యత
అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఆ భక్తుడు చిన్న గుడిని నిర్మించాడు. అయితే, దేవికి సమర్పించడానికి అతడి వద్ద కొబ్బరికాయ గానీ, ఇతర ఖరీదైన వస్తువులు గానీ లేవు. తన పేదరికాన్ని తలచుకుని కన్నీరు మున్నీరైన ఆ భక్తుడి కి దేవి మళ్ళీ దర్శనమిచ్చి ఇలా చెప్పిందట: “నాయనా! నాకు నీ ఆడంబరాలు అక్కర్లేదు, నీ నిష్కల్మషమైన ప్రేమే చాలు. ఇక్కడ పడి ఉన్న ఐదు రాళ్లనే నాకు భక్తితో సమర్పించు.” అప్పటి నుండి నేటి వరకు, ఈ ఆలయంలో ఆ ఐదు రాళ్లే మహాప్రసాదంగా కొనసాగుతున్నాయి. వాటితోపాటుగా ఒక పవ్వును అమ్మవారికి సమర్పిస్తారు.
ఆలయ విశిష్టత మరియు సందర్శన వివరాలు
ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక సంబరం
శ్రీ బాగదాయి అమ్మవారి కృపా కటాక్షాలతో మీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. శుభం భూయాత్!


