
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ తాజాగా సింహాచలంలో కనిపించారు. అన్వేష్ ఇంటికి వెళ్లాలని ప్రకటించి సంచలనం సృష్టించారు. పాకిస్తాన్ పర్యటన తర్వాత NIA విచారణను ఎదుర్కొన్న సన్నీ.. ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు.
Key Points
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో ల్యాండ్ అయ్యాడు.
అన్వేష్ ఇంటికి వెళ్తానని సన్నీ ఛాలెంజ్.
పాకిస్తాన్కు బైక్పై వెళ్లి వచ్చిన తర్వాత NIA విచారణ ఎదుర్కొన్నాడు.
సోషల్ మీడియాలో తన పోస్టులతో సంచలనం సృష్టిస్తున్నాడు.
సింహాచలంలో సన్నీ యాదవ్ ఆగమనం
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav ) గురించి కీలక అప్డేట్ వచ్చింది. మొన్నటి వరకు ఎన్ఐఏ (NIA) విచారణ ఎదుర్కొన్న యూట్యూబర్స్ భయ్యా సన్నీ యాదవ్… మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సింహాచలంలో ల్యాండ్ అయ్యాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్.
నేను ఏపీకి ( AP) వచ్చేసాను.. సింహాచలంలో ల్యాండ్ అయ్యాను.. ఇప్పుడు చూసుకుందాం రా… అంటూ అన్వేష్ ను ( Naa Anveshana) టార్గెట్ చేస్తూ సంచలన పోస్ట్ కూడా పెట్టాడు యూట్యూబ్ సన్నీ. అతి త్వరలోనే వైజాగ్ వెళుతున్నాను… మీ ఇంటికి కూడా వస్తానంటూ ఛాలెంజ్ విసిరాడు. మీ అమ్మ నాన్నకు కూడా ధైర్యంగా చెబుతానంటూ… సంచలన పోస్ట్ పెట్టాడు.
అన్వేష్కు సన్నీ యాదవ్ ఛాలెంజ్
నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు అంటూ అన్వేష్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానం ( Air India plane) ఎక్కిన వీడియోతో పాటు సింహాచలం లో ( Simhachalam) దిగిన విజువల్ షేర్ చేశాడు. కాగా ఇటీవల బైక్ పై పాకిస్తాన్ ( Pakisthan ) వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్… అడ్డంగా బుక్కయ్యాడు. యుద్ధం సమయంలోనే అక్కడికి వెళ్లడంతో అతన్ని ఎన్ఐఏ అధికారులు విచారించి వదిలేశారు.
NIA విచారణ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్
సింహాచలంలో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ నేనొచ్చేశానంటూ అన్వేష్ టార్గెట్గా పోస్టులు పెట్టిన సన్నీ. వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా.. మీ అమ్మానాన్నకి ధైర్యంగా చెబుతానంటూ అన్వేష్ని ఉద్దేశించి పోస్ట్. నువ్వు టెన్షన్ పడకు అంటూ అన్వేష్కి సన్నీ కౌంటర్. ఇటీవలే బైక్పై పాకిస్థాన్… pic.twitter.com/DLpmyZdmvR
భయ్యా సన్నీ యాదవ్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అతని తదుపరి చర్యలపై అందరి దృష్టి ఉంది.


