
📌 Key Points
- రాజ్, కావ్యలను మంత్రి ధర్మేంద్ర తన కూతురు బారసాలకు ఆహ్వానించడం హాట్ టాపిక్!
- బారసాలలో రుద్రాణి కొత్త ప్లాన్ వేయడం సంచలనంగా మారింది, ఏం జరుగుతుందో చూడాలి!
- ధాన్యలక్ష్మి ట్రస్ట్ ఏర్పాటుకు ఓకే చెప్పడంతో కథ కీలక మలుపు తిరిగింది.
- అప్పుకు పాప పుట్టడంతో దుగ్గిరాల ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది, సంబరాలు మొదలయ్యాయి.
బ్రహ్మముడి సీరియల్లో రోజుకో ట్విస్ట్! రాజ్, కావ్యల జీవితంలో కొత్త సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మినిస్టర్ ఆహ్వానం, రుద్రాణి ప్లాన్తో కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఏం జరగబోతుందో చూడాలి!
మినిస్టర్ ఆహ్వానం వెనుక అసలు కథేంటి?
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 19 ఎపిసోడ్లో రాజ్, కావ్య చేసినదానికి ధాన్యలక్ష్మీ పశ్చాత్తాపపడుతుంది. అప్పుకు పాప పుడుతుంది. దుగ్గిరాల ఇంటికొచ్చిన మంత్రి ధర్మేంద్ర తన కూతురు బారసాలకు ఆహ్వానిస్తాడు. అదే ఫంక్షన్లో రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది. అప్పు దగ్గర అటాక్ చేసిన రౌడీలు ఉన్నారని రేఖ వారిస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కల్యాణ్ నిజం చెప్పడంతో ధాన్యలక్ష్మీ ఫీల్ అవుతుంది. దాంతో అందరూ ధాన్యలక్ష్మిని తిడతారు. తనను ఏమనొద్దు అని కావ్య, రాజ్ అంటారు. నన్ను క్షమించురా అని ధాన్యలక్ష్మీ అంటుంది. తప్పు చేశాను, మన్నించండి అని పశ్చాత్తాపపడుతుంది. ఇంతలో డాక్టర్ అనురాధ వచ్చి అప్పుకు పాప పుట్టిందని చెబుతుంది.
రుద్రాణి ప్లాన్ మామూలుగా లేదుగా!
అత్తింటికి పాపతో అప్పు వెళ్తుంది. హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. పాపకు కవిత జ్ఞానం ఉండాలని కవిత్వం చెబుతాడు కల్యాణ్. నీలా కవి కాదు నాలా పోలీస్ కావాలి అని అప్పు ఉంటుంది. కవి, పోలీస్ రెండు అవుతుందని కల్యాణ్ అంటాడు. అటు సుభాష్ అపర్ణ, ఇటు ధాన్యలక్ష్మీ ప్రకాశం తమ మనవరాళ్లను ఆడిస్తూ మురిసిపోతారు.
పాప గురించి అడిగితే బాగుందని చెబుతాడు రాజ్. మీతో ఆత్మీయంగా మెలగాలన్న గతం వల్ల కొంత భయంగానే ఉంది. కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతున్నాను. రేపు నా కూతురుకు బారసాల. మీరు కచ్చితంగా రావాలి అని ఇన్వైట్ చేస్తాడు ధర్మేంద్ర . మీరంతా నా ఆప్తులే అంతా రావాలని ధర్మేంద్ర కావ్య సరేనంటుంది. దాంతో మినిస్టర్ వెళ్లిపోతాడు.
ధాన్యలక్ష్మి మనసు మార్చుకుందా?
అంతా నన్ను తిడతారు. మీరు కూడా అలాగే చేయండి. ఎవరు లేని అనాథలా ఉన్నానని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాను. దాంతో కరిగిపోతారని రుద్రాణి అంటుంది. ప్లాన్ బాగుందని రాహుల్, రేఖ అంటారు. కానీ, హాస్పిటల్లో అటాక్ చేసిన రౌడీలు ఇంకా అప్పు అండర్లోనే ఉన్నారు. మళ్లీ తాను ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికిపోతావని రేఖ అంటుంది.
పాపను ఆయనే రెడీ చేస్తారట, నేను కలుగజేసుకోవద్దట అని కావ్య చెబుతుంది. దాంతో అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి చూస్తారు. పాపను రెడీ చేస్తాడు రాజ్. నా కూతురును నాకు నచ్చినట్లు రెడీ చేస్తానని, ఎవరు కలుగజేసుకోవద్దని రాజ్ అంటాడు. అది చూసిన కావ్య మొహం వెలిగిపోతుంది. ఈ ఆనందం, సంతోషం అంతా నీవల్లే అని ఇందిరాదేవి అంటుంది.
బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


