
📌 Key Points
- రేఖ: రాజు నిజం తెలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్ళింది – షాకింగ్ ట్విస్ట్!
- స్వరాజ్: పీడకలలతో ఫ్యామిలీకి దగ్గరవుతున్నాడు – ఆందోళనలో తల్లిదండ్రులు!
- ఐశ్వర్య: రేఖ చేతిలో అవమానం – పరువు తీసిందని క్లాస్ పీకింది!
- నెక్లెస్: ఇందు ప్లాన్ బయటపెట్టిన స్వాతి – అసలు నిజం వెలుగులోకి!
బ్రహ్మముడి సీరియల్లో సరికొత్త ట్విస్ట్! రేఖ రాజు ఇంటికి వెళ్ళడం, స్వరాజ్ ఫ్యామిలీకి దగ్గరవడం ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది. అసలు ఏం జరగబోతుందో చూడటానికి సిద్ధంగా ఉండండి!
రాజు గురించి తెలుసుకోవడానికి రేఖ ప్రయత్నాలు!
Brahmamudi March 28th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 28 ఎపిసోడ్ లో రాజు గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఏకంగా అతని ఇంటికే వెళ్తుంది రేఖ. స్వరాజ్ కు మళ్లీ మళ్లీ పీడకలలు వస్తుండటంతో అతని ఫ్యామిలీకి దగ్గరవుతున్నాడేమో అని పెంచిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు.
Brahmamudi March 28th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్యను రేఖ లాగిపెట్టి కొడుతుంది. అందరి ముందూ తన పరువు తీశావని క్లాస్ పీకుతుంది. అటు రాజును చూసి షాక్ తిన్న రేఖ.. అతడు ఎవరో తేల్చే పనిలో భాగంగా ఏకంగా అతని ఇంటికే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
రాజు గురించి ఆరా తీసిన రేఖ
అప్పుడే అపర్ణ గది నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆమె రాజును ఎక్కడ చూస్తుందో అని రేఖ కంగారు పడిపోతోంది. వెంటనే భూషణ్ ను పంపించి ఆమెను లోనికి తీసుకెళ్లేలా చేస్తుంది. తర్వాత రాజును పక్కకు తీసుకెళ్లి అతని గురించి ఆరా తీస్తుంది. ఏ బస్తీలో ఉంటారు, ఏం చేస్తారు అని అడగడంతో అతడు రేఖను తిట్టి వెళ్లిపోతాడు.
స్వరాజ్ ఫ్యామిలీకి దగ్గరవుతున్నాడా?
ఐశ్వర్యకి క్లాస్ పీకిన రేఖ
ఇటు స్వాతిని లోనికి తీసుకెళ్లి ఆ నెక్లెస్ రేఖకు ఎందుకు ఇచ్చావ్ అని తల్లి భ్రమరాంబ క్లాస్ పీకుతుంది. ఆమెదే కాబట్టి ఆమెకు ఇచ్చానని స్వాతి అంటుంది. అసలు ఆ నెక్లెస్ అక్కడే దొరికిందా అని భ్రమరాంబ అడుగుతుంది. అది నిజం కాదని అంటుంది. మరి అసలు నిజమేంటని స్వాతి, శేషు కావాలని భ్రమరాంబను ఆటపట్టిస్తారు.
వెంకీకి సినిమా టికెట్లు ఇచ్చిన నందు.. హ్యాండిచ్చిన రోజా
దీంతో రోజాను పిలిచి పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ షో టికెట్లు అడితావు కదా.. తెచ్చాను అని వెంకీ బిల్డప్ ఇస్తాడు. అయితే ఆ టికెట్లు తీసుకొని తాను తన కజిన్ తో కలిసి సినిమాకు వెళ్తానని అనడంతో వెంకీ, నందు షాక్ తింటారు. అది నిన్ను వాడుకుంటోంది అంటూ వెంకీకి చెబుతుంది నందు. అయినా అతడు మాత్రం వినడు.
ఐశ్వర్యకు రేఖ వార్నింగ్.. అసలేం జరిగింది?
స్వాతి దగ్గర అసలు ప్లాన్ బయటపెట్టిన ఇందు
ఆ తర్వాత టాపిక్ నెక్లెస్ మీదికి మళ్లుతుంది. అసలు కొట్టేసిన వాళ్లు ఇంటికి తెచ్చి ఇవ్వడం ఏంటని స్వాతి అడిగితే తానే వాళ్లు ఇంటికి వచ్చేలా చేశానని ఇందు చెబుతుంది. నెక్లెస్ అమ్మడానికి ప్రయత్నించినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా వాళ్లను పట్టుకున్న ఇందు.. రాజు, లక్కీలను భయపెట్టి ఐశ్వర్య ఇంటి అడ్రెస్ ఇచ్చి మరీ ఇంటికి వచ్చేలా చేస్తుంది. అది విన్న స్వాతి నీతో జాగ్రత్తగా ఉండాలంటూ ఇందుతో సరదాగా అంటుంది.
తన మనిషిని లోనికి పంపించి జనాభా లెక్కలు అంటూ వాళ్ల వివరాలు సేకరిస్తుంది. తన పేరు చలపతి అని రాజు తండ్రి చెబుతుంది. అతడు మీ అబ్బాయా అని అడిగితే.. కాదు దొరికితే తీసుకొచ్చామని అతడు అనడంతో రాజుతోపాటు రేఖ కూడా షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. రేఖ నిజం తెలుసుకుంటుందా? స్వరాజ్ ఫ్యామిలీ డ్రామా ఎలా మారుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


