
📌 Key Points
- రాజ్ పోలికలతో రాజును చూసి భయంతో ఫుల్ బాటిల్ తాగిన రేఖ.
- ఐశ్వర్యకు 10 లక్షల అప్పు ఉందని తెలుసుకున్న రాకేష్.
- వారం రోజులు టైమ్ అడిగిన ఐశ్వర్య.. రెండు రోజులే గడువు ఇచ్చిన రాకేష్.
- రాజుకు దుగ్గిరాల కుటుంబానికి సంబంధం లేదని నిశ్చయించుకున్న రేఖ.
బ్రహ్మముడి సీరియల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజు రాకతో దుగ్గిరాల ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. రేఖ ఫుల్ బాటిల్ తాగడానికి గల కారణం ఏమిటి? అసలు రాజు ఎవరు?
రాజును చూసి షాక్ తిన్న రేఖ!
Brahmamudi Serial March 30th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 30వ ఎపిసోడ్లో రాజ్ పోలికలతో రాజును చూసిన రేఖ భయంతో ఫుల్ బాటిల్ తాగుతుంది. రాజు గురించి తెలుసుకునేందుకు చలపతి రావు ఇంటికి జనాభా లెక్కల పేరుతో ఒకతన్ని పంపిస్తుంది. ఐశ్వర్యకు 10 లక్షల అప్పు ఉన్న విషయం ఇందుకు తెలుస్తుది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్లో రేఖ తాగుతూ రాజ్ చనిపోవడం. రాజు ఇంటికి రావడం గురించి టెన్షన్ పడుతుంది. ఆ కంగారుతో ఫుల్ బాటిల్ తీసుకుని మరి తాగుతుంది. ఇంతలో భ్రమరాంబ వచ్చి ఎందుకంతా కంగారుపడుతున్నావ్ అని అడుగుతుంది. ఆ అబ్బాయికి నీకు ఏంటీ సంబంధం అని అంటుంది.
దాంతో ఈ ఆస్తి మనకు దక్కదా అని భ్రమరాంబ తెగ భయపడిపోతుంది. ఇదంతా నా అపోహే. కేవలం వాడు రాజ్ పోలికలతోనే ఉన్నాడా, ఇన్నిరోజులు ఇక్కడికి ఎందుకు రాలేదు. వాడి గురించి తెలుసుకోవాలి అని రేఖ అంటుంది. మరోవైపు ఉదయం బాంబ్ బ్లాస్టర్ కలలో వచ్చి మళ్లీ అరిచి లేస్తాడు రాజ్. ఎవరు పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులపై అరుస్తాడు రాజు.
ఐశ్వర్యకు రాకేష్ వార్నింగ్!
ఏదో ఒక వ్యాన్ కాలిపోయింది. అందులో నుంచి ఒకడు ఎగిరి పడ్డాడు అని రాజు చెబుతాడు. దాంతో చలపతిరావు సెటైర్లు వేస్తాడు. దాంతో రాజు వెళ్లిపోతాడు. వాడు చిన్నప్పుడు శ్రీశైలంలో దొరికిన విషయం దాచి తప్పు చేస్తున్నామా. ఇప్పుడు వాడు పెద్దవాడు అయ్యాడు. ఇంకా నిజం దాచాలా అని తల్లి అంటుంది. వాడి తల్లిదండ్రులు బతికి ఉంటే చెప్పేవాళ్లం. కానీ, బతికి లేకుంటే వాడు ఎంత బాధపడతాడు అని చలపతి రావు అంటాడు.
ఎక్కడో దొరికితే అద్దెకు తెచ్చుకున్నామని చలపతి రావు అంటాడు. దాంతో రేఖ షాక్ అవుతుంది. తర్వాత వాడు నా కన్నకొడుకు, నా కష్టార్జీతం. ఇంకోడు నా చిన్నకొడుకు వెంకీ అని చలపతి రావు చెబుతాడు. ఎన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్నారు, చలపతి రావు తండ్రి, తాత గురించి కూడా ఫోన్లో అడిగిపిస్తుంది రేఖ. దాంతో చలపతి రావు అతనిపై సెటైర్లు వేస్తాడు. రాజుకు దూరపు చుట్టాలు, బంధువులు ఉన్నారా అని రేఖ అడిగిపిస్తుంది.
దుగ్గిరాల ఇంట్లో రాజు కలకలం!
వాడికి ఉంటే నాకు ఉన్నట్లేగా అని తిడతాడు చలపతి రావు. వీళ్లు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈ రాజుకు దుగ్గిరాల కుటుంబానికి ఏ సంబంధం లేదని రేఖ నిశ్చయంగా ఉంటుంది. మరోవైపు రేఖకు రాకేష్ పది లక్షల కోసం కాల్ చేస్తాడు. ఐశ్వర్య జరిగింది చెబితే రాకేష్ నమ్మడు. వారం రోజుల టైమ్ ఐశ్వర్య అడిగితే.. కేవలం 2 రోజులు మాత్రమే ఇస్తాను. లేకుంటే మీ ఆంటీతో తేల్చుకుంటాను అని రాకేష్ కాల్ కట్ చేస్తాడు.
దొంగతనం నువ్వు చేసి నా మీద ఎందుకు నింద వేశావ్ అని అడుగుతుంది ఇందు. నువ్వు మంచిదానిలా ముసుగేసుకుని తిరిగితే నేను నమ్ముతానా. మీ అమ్మ కూడా ఇలాగే అందరిని నమ్మించి ఆస్తి మొత్తం గుప్పిట్లో పెట్టుకుందటగా అని కావ్యను అంటుంది ఐశ్వర్య. నువ్వు రేఖ అంటీ మాయలో ఉన్నావ్. నిజం తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చి తప్పు చేశానని అంటావ్ అని ఇందు అంటుంది. అలాంటి రోజు వస్తే చావనైనా చస్తాను కానీ నీ దగ్గరికి రాను అని ఐశ్వర్య అంటుంది.
బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. రాజు రాకతో కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


