
📌 Key Points
- కావ్య కడుపు పోయేలా, రాజ్పై దొంగ బంగారం కేసు పెట్టాలని రుద్రాణి కుట్ర.
- కనకం పుట్టింట్లో సీమంతం కోసం పంతులును తీసుకువచ్చింది.
- ఇందిరాదేవి సీమంతం అత్తింట్లోనే చేయాలని చెప్పడంతో కనకం అంగీకరించింది.
- సీమంతం కోసం కనకం ఇచ్చిన డబ్బును రాజ్ ఆమె తృప్తి కోసం తీసుకున్నాడు.
బ్రహ్మముడి సీరియల్ జనవరి 3 ఎపిసోడ్లో కావ్య, రాజ్ల జీవితాల్లో పెను విషాదం చోటు చేసుకోనుంది. కావ్య కడుపు తీసేయడానికి, రాజ్ను దొంగ బంగారం కేసులో ఇరికించడానికి రుద్రాణి, రాహుల్, రేఖ కుట్ర పన్నుతారు. ఈ లోపు సీమంతం ఏర్పాట్లు, కల్యాణ్ త్యాగం ఉత్కంఠను రేపుతున్నాయి.
రుద్రాణి, రాహుల్ కుట్ర: కావ్య, రాజ్ లక్ష్యం
బ్రహ్మముడి సీరియల్ జనవరి 3 ఎపిసోడ్లో కావ్యకు కడుపు పోయేలా చేసి, దొంగ బంగారం కేసులో రాజ్ను ఇరికించి జైలుకు పంపించాలని, కంపెనీని నాశనం చేయాలని రుద్రాణి, రాహుల్, రేఖ స్కెచ్ వేస్తారు. కనకం దుగ్గిరాల ఇంటికి వస్తుంది. సీమంతం గురించి కనకం చెబితే అత్తింట్లోనే చేపిద్దామని ఇందిరాదేవి చెబుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజ్తో డ్యాన్స్ చేయడాన్ని తలుచుకుని మురిసిపోతుంది రేఖ. పక్కనే రుద్రాణి ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి రాజ్ కార్ తీసుకుంది చూపిస్తాడు. రాజ్ కారులో దొంగ బంగారం పెట్టేయ్. దొంగ బంగారం కొన్నాడన్న కేసులో పూర్తిగా ఇరికించేయ్ అని రుద్రాణి అంటుంది.
రాజ్కు అన్ని పోయి ఒంటరివాడు కావాలి. అప్పుడు మనం చెప్పినట్లు వింటాడు. కావ్య కడుపు పోవాలి, రాజ్ దొంగ బంగారం కేసులో ఇరుక్కోవాలి. ఈ రెండు జరుగుతునే రాజ్ నీవాడు అవుతాడు అని రుద్రాణి అంటుంది. రాజ్ను మళ్లీ నేను బెయిల్ మీద తీసుకొస్తా. అప్పుడు మన మీద కృతజ్ఞత భావం, నీ మీద లవ్ రెండు ఒకేసారి పుట్టుకొస్తాయని రాహుల్ అంటాడు.
సీమంతం సందడి: కనకం బాధ్యత, రాజ్ నిర్ణయం
కంపెనీ నాశనం, దాని కడుపు పోవడం రెండు ఒకేసారి జరిగిపోవాలి అని రుద్రాణి అంటుంది. మరోవైపు అప్పు, కావ్య అటు ఇటు నడుస్తుంటారు.ఇంతలో కనకం పంతులును తీసుకుని వస్తుంది. మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్లాలి. సీమంతం చేయాలి. నా చేత్తో పురుడు పోయాలని కనకం చెబుతుంది. అందరిని కావ్య పిలుస్తుంది. పురుడుకు పుట్టింటికి తీసుకెళ్లాలని పంతులును తీసుకొచ్చానని కనకం అంటుంది.
సీమంతానికి ఏమేం కావాలో రాజ్, కల్యాణ్ లిస్ట్ రాస్తారు. కావ్య, అప్పు భర్తలను వెతుక్కుని వస్తారు. సినిమాలు చూసి సీమంతం చేస్తాం. ఏ సినిమాలో చేయనంత గ్రాండ్గా సీమంతం చేస్తామని రాజ్ అంటాడు. ఇంతలో కనకం వచ్చి డబ్బు ఇస్తుంది. సీమంతం కోసం మీ మావయ్య డబ్బు పొదుపు చేశారు. పుట్టింట్లో జరిగితే ఈ డబ్బు బయటకు వచ్చేది కాదు. కానీ, తండ్రి బాధ్యతగా డబ్బు తీసుకోమని కనకం చెబుతుంది.
మీ తృప్తి కోసం ఈ డబ్బు తీసుకుంటాను అని రాజ్ తీసుకుంటాడు. ఇంతలో రేఖ వచ్చి సీమంతంలో ఏమైనా డౌట్ ఉంటే చెప్పమని, ఫారెన్లో ఇలాంటివి చాలా ఆర్గనైజ్ చేశానని చెబుతుంది. నువ్ చేసినవి పార్టీ కల్చర్వి. ఇక్కడ అలా చేస్తే మా కొంప కొల్లేరు అవుతుందని రాజ్ అంటాడు. దానికి కావ్య, అప్పు నవ్వుతారు. అందుకు రేఖ అవమానంగా ఫీల్ అయి కోప్పడుతంది.
రేఖ కలగజేత: రాజ్-కావ్య స్పందన
కావ్య సీమంతం ముందు ఇవన్నీ ఎంత చెప్పు. ఏ గండం లేకుండా కావ్య బిడ్డను కంటే చాలు అని సుభాష్ అంటాడు. మరోవైపు రెడ్ కలర్ పట్టుచీర సీమంతానికి నా పొట్టి కట్టుకుంటే అదిరిపోతుందని కల్యాణ్ అనుకుంటాడు. ఇంతలో అప్పు వచ్చి కల్యాణ్కు సర్ప్రైజ్ అని గిఫ్ట్ ఇస్తుంది. అందులో బ్లూ కలర్ పట్టుచీర ఉంటుంది. అమ్మ నాకోసం కంచి నుంచి తీసుకువచ్చింది. ఎంత కష్టపడిందో అని అప్పు అంటుంది.
అయితే, ఈ చీరనే కట్టుకో అని కల్యాణ్ అంటాడు. దాంతో కల్యాణ్ సర్ప్రైజ్ ఇద్దామనుకంటే షాక్ ఎదురవుతుంది. ఇంతలో చేతిలో ఏముందని లాక్కుని తీసుకుంటుంది అప్పు. ఇంతమంచి చీర తీసుకొచ్చి దాస్తావేంటని అడుగుతుంది అప్పు . మీ అమ్మగారు కూడా చీర తీసుకొచ్చారుగా.
రుద్రాణి, రాహుల్ కుట్రలు సఫలమవుతాయా? కావ్య, రాజ్ ఈ గండం నుండి ఎలా బయటపడతారు? కల్యాణ్ త్యాగం వారిని ఎలా రక్షిస్తుంది? తదుపరి ఎపిసోడ్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఉత్కంఠభరిత మలుపుల కోసం సిద్ధంగా ఉండండి.


