|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా రంగంలో సంచలనం: తారలైన ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు నిర్మాతలుగా మారారు! ఎవరంటే?

Published: 07-01-2026, 2:35 AM
సినిమా రంగంలో సంచలనం: తారలైన ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు నిర్మాతలుగా మారారు! ఎవరంటే?
  • సెలబ్రిటీల వారసులు సినిమాలోని 24 శాఖలలో ఏదో ఒక దానిలో స్థిరపడుతున్నారు.
  • వరలక్ష్మి శరత్ కుమార్, పూజ శరత్ కుమార్ కలిసి ‘సరస్వతి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
  • స్వప్న దత్, ప్రియాంక దత్ ‘స్వప్న సినిమాస్’ ద్వారా విజయవంతమైన నిర్మాతలుగా నిలిచారు.
  • దత్ సిస్టర్స్ ‘మహానటి’, ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు.

సినీ పరిశ్రమలో కొత్త ఒరవడి! సెలబ్రిటీల వారసులు కేవలం నటులుగానే కాకుండా, ఇప్పుడు నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్-పూజ శరత్ కుమార్, అలాగే స్వప్న దత్-ప్రియాంక దత్ వంటి అక్కాచెల్లెళ్లు సినీ నిర్మాణంలో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ట్రెండ్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

నిర్మాతలుగా మారుతున్న సెలబ్రిటీ వారసులు

Film industry:ఈమధ్యకాలంలో సెలబ్రిటీల వారసులు సినీ ఇండస్ట్రీలో ఉండే 24 శాఖలలో ఏదో ఒక శాఖలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది హీరోలుగా.. మరికొంతమంది హీరోయిన్లుగా సెటిల్ అవుతుంటే ఇంకొంతమంది సెలబ్రిటీల వారసులు మాత్రం డైరెక్షన్, ప్రొడక్షన్ విభాగంలో సెటిల్ అవుతూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇంకొంతమంది ఇండస్ట్రీకి దూరంగా వ్యాపారాలు చేసుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఒక సెలబ్రిటీకి ఇద్దరు పిల్లలు ఉంటే.. వారిద్దరూ వేరువేరు రంగాలలో కొనసాగుతున్నారు. కానీ ఇక్కడ కొంతమంది సెలబ్రిటీలకు చెందిన వారసురాళ్లు మాత్రం నిర్మాతలుగా కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి నిర్మాతలుగా కొనసాగుతున్న ఆ సెలబ్రిటీ సిస్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. ఈమె స్వీయ దర్శకత్వంలో సోదరీ పూజా శరత్ కుమార్ తో కలిసి ‘సరస్వతి’ అనే న్యూ ఏజ్ థ్రిల్లర్ ను రూపొందిస్తున్నారు. పైగా ఈ చిత్రానికి వీరిద్దరూ నిర్మాతలు కూడా.. అలా వీరిద్దరూ కలిసి నిర్మాతలుగా మారారు. ఇప్పుడు సరస్వతి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. జీవ , ప్రకాష్ రాజ్ , ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా హై కాన్సెప్ట్ మూవీ అని వరలక్ష్మి కూడా చెప్పుకొచ్చింది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా వీరికి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

వరలక్ష్మి-పూజ శరత్ కుమార్ నిర్మాణ ప్రస్థానం

ప్రముఖ బడా నిర్మాత అశ్వినీ దత్ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు స్వప్న దత్, ప్రియాంక దత్. దత్ సిస్టర్స్ అయిన వీరు స్వప్న సినిమాస్, వైజయంతి బ్యానర్లపై పలు చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ లేడీ ప్రొడ్యూసర్స్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతి రత్నాలు, సీతారామం, అన్నీ మంచి శకునములే, కల్కి 2898AD, ఛాంపియన్ వంటి చిత్రాలను సంయుక్తంగా నిర్మించి మంచి పేరు దక్కించుకున్నారు.

అలా నిర్మాతలుగా ఈ సిస్టర్స్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్ సిస్టర్స్ కూడా నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరు గనుక సక్సెస్ అయితే ఈ జాబితాలోకి ఇంకొంతమంది సెలబ్రిటీ సిస్టర్స్ నేతలుగా అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదని చెప్పవచ్చు.

దిగ్గజ నిర్మాత అశ్వినీ దత్ వారసుల విజయం

సినిమా పరిశ్రమలో సెలబ్రిటీ సిస్టర్స్ నిర్మాతలుగా రాణించడం ఒక కొత్త ట్రెండ్. వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, స్వప్న దత్, ప్రియాంక దత్ వంటి వారు ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకున్నారు. ఈ ధోరణి భవిష్యత్తులో మరింత మందికి స్ఫూర్తినిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.