
📌 Key Points
- బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ. 225 కోట్లు కేటాయించారు.
- ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని సీఎం ఆదేశించారు.
- ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలు మాత్రమే వాడాలని సూచన.
- బాసర నుండి భద్రాచలం వరకు ఆలయ కారిడార్ అభివృద్ధి చేయనున్నారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.225 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఆయన పరిశీలించారు.
మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
బాసరలోని పవిత్ర జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని అధికారులను ఆదేశించారు.
నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం రూ. 225 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈనెల 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని…. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు
తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్లో భాగంగా బాసరను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా…. పర్యావరణహిత క్షేత్రంగా తీర్చిదిద్దుతారు. భవిష్యత్తులో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు, అధునాతన క్యూ కాంప్లెక్స్లు, ఘాట్ల విస్తరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తారు.
పర్యాటక హబ్గా బాసర – భద్రాచలం కారిడార్
మాస్టర్ ప్లాన్ లో భాగంగా…. ఆలయ గర్భాలయం, రాజగోపురాలు, మడ వీధులతో పాటు భక్తుల వసతి సౌకర్యాలను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయ కారిడార్ను పర్యాటక హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంతేకాకుండా గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘాట్లతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
బాసర ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, భక్తులకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. త్వరలోనే ఆలయ రూపురేఖలు మారనున్నాయి.

