
📌 Key Points
- జూన్ 15లోపు విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
- దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి.
- అవకతవకలు నివారించేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చారు.
- విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం, సరఫరాదారుల ప్రయోజనాలు కాదని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించారు. జూన్ 15లోపు వారికి అవసరమైన ఎడ్యుకేషన్ కిట్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన అక్రమాలను నివారించేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం.
కొనుగోళ్లలో అక్రమాలకు చెక్: సీఎం రేవంత్ రెడ్డి
TG Govt Education Kits : విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందించగలిగితే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపుతారని అన్నారు.
విద్యా శాఖతో పాటు బీసీ , మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందజేసే సామగ్రిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ విడిగా ప్రొక్యూర్మెంట్, సరఫరా చేపట్టడంతో ఏకరూపత లోపించడంతో పాటు అనేక అక్రమాలు చోటుచేసుకునేవని గుర్తు చేశారు. వాటిని అరికట్టేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చామని వివరించారు.
కేంద్రీకృత విధానంతో జవాబుదారీతనం
అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తుందని, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కాదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
జూన్ 15లోపు కిట్లు అందజేయాలి: సీఎం
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన ఎడ్యుకేషన్ కిట్లు అందే అవకాశం ఉంది. కేంద్రీకృత కొనుగోలు విధానం అవినీతిని అరికట్టి, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది విద్యా రంగంలో కొత్త ఒరవడికి నాంది.


