
దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించి, కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
Key Points
నవరాత్రుల్లో రత్నాలు ధరించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి.
కొత్త దేవుడి విగ్రహాలు, చిత్రపటాలు ఇంటికి సానుకూల శక్తిని తెస్తాయి.
కాస్మెటిక్స్, అద్దం, దువ్వెనలు కొనడం అదృష్టాన్ని ఆకర్షిస్తుంది.
జమ్మి, తులసి మొక్కలు నాటడం శనిదోషాన్ని తగ్గిస్తుంది.
శుభ ఫలితాల కోసం కొనుగోలు చేయవలసిన వస్తువులు
నవరాత్రులు ఇప్పటికే మొదలైపోయాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు. ప్రతి రోజు రకరకాల నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో చాలా చోట్ల నవరాత్రులను ఘనంగా జరుపుతారు. నవరాత్రి సమయంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనేది చూసుకుని కొత్త దుస్తుల్ని కూడా ధరిస్తూ ఉంటారు. నవరాత్రుల్లో కొత్త దుస్తులతో పాటు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి.
నవరాత్రుల సమయంలో వీటిని కొంటే సంతోషం ఎక్కువవుతుంది, కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి, దుర్గాదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. మరి మనం నవరాత్రుల్లో ఏ వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది? వేటి వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి?
నవరాత్రుల్లో వీటిని కొంటే చాలా మంచి ఫలితం ఉంటుంది
నవరాత్రుల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. డబ్బుకి లోటు ఉండదు, ఆనందం కూడా రెట్టింపు అవుతుంది, దుర్గాదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. మరి నవరాత్రుల్లో వేటిని కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.
దుర్గాదేవి అనుగ్రహం పొందే మార్గాలు
నవరాత్రుల్లో రత్నాలను కొనుగోలు చేయడం వలన మంచి ఫలితం చూస్తారు. మీ జాతకాన్ని జ్యోతిష్కులకు చూపించుకుని తగిన రత్నాన్ని ధరించడం వలన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నవరాత్రుల్లో రత్నాలను కొనుగోలు చేసి ధరిస్తే ఎప్పటి నుంచో పూర్తికాని పనులు పూర్తవుతాయి. చాలా విధాలుగా లాభాలు కలుగుతాయి.
2.కొత్త దేవుడి విగ్రహాలు, చిత్రపటాలు
నవరాత్రుల్లో కొత్త దేవుడి విగ్రహాలు లేదా చిత్రపటాలను ఇంటికి తీసుకొస్తే మంచిది. దాని వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రశాంతత కూడా ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది.
కాస్మెటిక్స్ కొనుగోలు చేస్తే కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. అద్దం, దువ్వెన, తిలకం వంటి వాటిని కొనుగోలు చేసి అమ్మవారికి సమర్పించండి. అదేవిధంగా స్వయంగా మీకోసం కూడా కొనుగోలు చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
నవరాత్రుల్లో ఇంటికి శుభాన్ని ఆహ్వానించడం
4.జమ్మి మొక్క, తులసి మొక్క
శనిదోషంతో బాధపడేవారు నవరాత్రుల్లో ఇంట్లో ఒక జమ్మి మొక్కను నాటండి. తులసి మొక్కను నాటితే కూడా మంచి జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.
నవరాత్రుల్లో ఇల్లు, భూములు కొనుగోలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలా చేయడం వలన డబ్బుకి లోటు ఉండదు, ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది, సంతోషంగా ఉండొచ్చు.
బంగారం, వెండి, కార్లు వంటి వాటిని నవరాత్రుల్లో కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండవు, దేనికి లోటు ఉండదు.
నవరాత్రుల సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మీ ఇంటికి శ్రేయస్సు, ఆనందం, దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. శుభకార్యాలకు శుభ సమయం ఇది.

