
📌 Key Points
- పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య.
- ఆత్మహత్య చేసుకున్నది నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన డాక్టర్ గోపి కుటుంబం.
- భోపాల్ ఎయిమ్స్లో డాక్టర్గా గోపి, భార్య శంకర కుమారి నర్సుగా పనిచేస్తున్నారు.
- చిన్నారితో సహా దంపతులు మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. నరసరావుపేటలోని ఒక లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లాడ్జిలో డాక్టర్ కుటుంబం సూసైడ్
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ముగ్గురు చనిపోయారు. ఈ విషాదఘటన నరసారావుపేట.. లాడ్జిలో జరిగింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నాదెండ్ల మండలం సాతులూరుగా చెందిన ఓ డాక్టర్ ఫ్యామిలీ ప్రాణాలు తీసుకున్నది. ఏం సమస్య వచ్చిందో తెలియదుగానీ.. మూడేళ్ల చిన్నారితోపాటుగా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
భోపాల్ నుండి వచ్చిన డాక్టర్ గోపి కుటుంబం
నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన డాక్టర్ గోపి కుటుంబం మధ్యప్రదేశ్లోని భోపాల్లో నివాసం ఉంటోంది. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో గోపి డాక్టర్గా పనిచేస్తున్నారు. అతడి భార్య శంకర కుమారి నర్సుగా చేస్తోంది. వీరికి మూడేళ్ల చిన్నారి మౌనిక ఉంది.
ఈ కుటుంబం శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చింది. ఆ తర్వాత ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారితోపాటుగా దంపతులిద్దరూ ప్రాణాలను తీసుకున్నారు. ఏం కష్టం వచ్చిందో ఈ దారుణానికి పాల్పడ్డారు.
మత్తు ఇంజెక్షన్ తో ఆత్మహత్య చేసుకున్న దంపతులు?
ఆదివారం గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది.. తలుపులు బద్దలు కొట్టి చూశారు. ఈ విషయాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. గదిని నిశితంగా పరిశీలించారు. మత్తు ఇంజెక్షన్ తీసుకుని.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.


