
📌 Key Points
- బాలయ్య, పవన్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ‘ఫ్యాన్ వార్’ తీవ్రంగా మారింది.
- సినిమా రిలీజ్ల వాయిదాలపై ఇరు వర్గాల ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు.
- ఫ్యాన్స్ చేస్తున్న ఈ రచ్చపై బాలయ్య, పవన్ సీరియస్ అయ్యారని సమాచారం.
- తమ అభిమానుల సంఘాలను సైలెంట్గా ఉండాలని అగ్ర హీరోలు ఆదేశించినట్టు టాక్.
బాలయ్య, పవన్ అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా ‘ఫ్యాన్ వార్’ ఇప్పుడు అగ్ర హీరోలకు తలనొప్పిగా మారింది. సినిమా రిలీజ్ల వాయిదాల విషయంలో ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటుండగా, ఈ రచ్చపై ఇద్దరు హీరోలు సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది.
అగ్ర హీరోల ఫ్యాన్ వార్కి కారణం ఏంటి?
Fan War: ఇటు అఖండ. అటు అజ్ఞాత వాసి. ఒకరిది మెగా కాంపౌండ్. మరొకరిది నందమూరి కోటరీ. వారిద్దరు రూట్ వేరు. వాళ్ల తీరు కూడా సెపరేటు. కానీ అనుకోని, అవసరం లేని రచ్చ ఆ ఇద్దరికి హెడెక్గా మారుతోందట. కొందరు ఫ్యాన్స్ చేస్తున్న అతి.. ఇటు బాలయ్యకు, ఇటు పవన్కు చిరాకు తెప్పిస్తుందట. అసలు ఫ్యాన్స్ పెడుతున్న చిచ్చు ఏంటి? అగ్ర హీరోల రియాక్షన్ ఎలా ఉంది?
ఇద్దరు అగ్రహీరోలు. అంతే కాదు కూటమి మిత్రులు. అటు పవన్..ఇటు బాలయ్య. ఇద్దరు పాలిటిక్స్లో ఉన్నారు. పైగా పవన్ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పోస్ట్గా ఉండగా..బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే కొందరు చేస్తున్న అతికి ఈ ఇద్దరు హీరోలు..తమకు సంబంధం లేకపోయినా ఇబ్బంది పడాల్సి వస్తోందట. దీనికి పుల్ స్టాప్ పెట్టాలని తమ ఫ్యాన్స్ అసోసియేషన్స్కు చురకలు అంటించారట ఆ ఇద్దరు పెద్ద హీరోలు.
ఫ్యాన్స్ చేస్తున్న అతిపై బాలయ్య, పవన్ స్పందన ఎలా ఉంది?
హరిహర వీరమల్లు రిలీజ్ దాదాపు మూడు సార్లు వాయిదా పడటంతో బాలయ్య ఫ్యాన్స్ పవన్ టార్గెట్గా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారట. కనీసం తన సినిమాను అనకున్న టైమ్కు రిలీజ్ చేసుకోలేకపోతున్నాడంటూ పోస్ట్లు పెట్టారట. దీంతో పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వటం..తిరిగి కౌంటర్లు ఇవ్వటం చేశారు.
ఇప్పుడు అఖండ-2 రిలీజ్ ఆల్ ఆఫ్ సడెన్గా వాయిదా పడటంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. హరిహర వీరమల్లు రిలీజ్ టైమ్లో పవన్ ముందుకు వచ్చి నిర్మాతకు నష్టం కలగకుండా జోక్యం చేసుకుని సినిమా రిలీజ్ చేయించాడని..కానీ బాలయ్య ఎందుకు రావటం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వార్ కాస్త ఇటు బాలయ్య..అటు పవన్ దృష్టికి వెళ్లినట్టు టాక్. దీంతో తమ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవపడటం చూసి ఇది ఎక్కడ దాకా పోతుందోనని ఫ్యాన్స్ గ్రూప్స్ను సైలెంట్గా ఉండాలని కాస్త గట్టిగానే చెప్పారని టాక్. బాలయ్య..పవన్ మాటలను విని ఫ్యాన్స్ ట్రోల్స్ను ఆపుతారా లేదా చూడాలి.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ రచ్చ: అసలు సమస్య ఏమిటి?
అగ్ర హీరోలైన బాలయ్య, పవన్కు సంబంధం లేని ఈ ‘ఫ్యాన్ వార్’ వారిరువురికీ ఇబ్బందికరంగా మారింది. ఫ్యాన్స్ తమ ట్రోలింగ్ ఆపుతారా లేదా వేచి చూడాలి. సామరస్యం కోరుకుంటున్న అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


