|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ హీరోయిన్ ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తాం.. ఇది ట్రైలరే.. మా ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోం: బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు ఫైరింగ్

Published: 12-09-2025, 12:44 PM
ఆ హీరోయిన్ ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తాం.. ఇది ట్రైలరే.. మా ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోం: బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు ఫైరింగ్

బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు గ్యాంగ్‌స్టర్లు కాల్పులు జరిపారు. సాధువులను అవమానించినందుకు ప్రతీకారంగా ఈ కాల్పులు జరిపినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో బాలీవుడ్‌లో ఉద్రిక్తత నెలకొంది.

Key Points

1

బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగాయి.

2

గోల్డీ బ్రార్ మరియు రోహిత్ గోదారా గ్యాంగ్ ఈ ఘటనకు బాధ్యత వహించింది.

4

దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఆధ్యాత్మికవేత్త అనిరుద్ధాచార్య వ్యాఖ్యలను ఖండించింది.

దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు

బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు శుక్రవారం (సెప్టెంబర్ 13) కాల్పులు జరిగాయి. న్యూస్ 24 ఆన్‌లైన్ రిపోర్ట్ ప్రకారం గాంగ్‌స్టర్స్ గోల్డీ బ్రార్ ఇంకా రోహిత్ గోదారా ఈ ఫైరింగ్ జరిపారు. తమ ప్రేమానంద్ మహారాజ్‌ను అగౌరవపరిచినందుకే ఈ కాల్పులు జరిపామని వాళ్లు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

ఈ రిపోర్ట్ ప్రకారం నటి దిశా పటానీ ఇంటి ముందు (విల్లా నంబర్ 40, సివిల్ లైన్స్ బరేలీ, యూపీ) కాల్పులు జరిగాయి. రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్ లో ఈ కాల్పులకు తామే బాధ్యులమని చెప్పింది.

గ్యాంగ్‌స్టర్ల హెచ్చరిక

“నేను, విరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ (దేలానా) బ్రదర్స్. ఈ రోజు ఖుష్బూ పటానీ / దిశా పటానీ (బాలీవుడ్ నటి) ఇంట్లో (విల్లా నంబర్ 40, సివిల్ లైన్స్ బరేలీ, యూపీ) జరిగిన కాల్పులు మేము చేయించాం. ఆమె మా గౌరవనీయమైన సాధువులను (ప్రేమానంద్ జీ మహారాజ్, అనిరుద్ధాచార్య జీ మహారాజ్) అవమానించారు. ఆమె మా సనాతన ధర్మాన్ని కించపరచడానికి ప్రయత్నించారు” అని అందులో ఉంది.

“మా పూజ్యనీయ దేవుళ్ళను అవమానించడాన్ని మేము సహించము. ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ టైం మళ్ళీ ఆమె లేదా ఇంకెవరైనా మా ధర్మాన్ని అవమానిస్తే.. మేము వాళ్ళ ఇంట్లో ఎవరినీ బతకనివ్వము. ఈ మెసేజ్ ఆమెకు మాత్రమే కాదు సినిమా ప్రపంచంలోని అందరు ఆర్టిస్టులకు వాళ్ళతో సంబంధం ఉన్న వారికి కూడా. భవిష్యత్తులో ఎవరైతే మా ధర్మం, సాధువుల గురించి అవమానకర కామెంట్స్ చేస్తారో అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మా ధర్మాన్ని కాపాడటానికి మేము ఏ స్థాయికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడూ వెనక్కి తగ్గము” అని ఆ నోట్ ముగిసింది.

ఖుష్బూ పటానీ స్పందన

దిశా పటానీ, ఖుష్బూ ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ.. ఆధ్యాత్మికవేత్త అనిరుద్ధాచార్య మహిళలు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ గురించి చేసిన కామెంట్స్ కు వ్యతిరేకంగా మాట్లాడింది. 25 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్లికాని మహిళలు ఎక్కువగా ఒకరిని వదిలి మరొకరి దగ్గరికి వెళ్తుంటారు అని అనిరుద్ధాచార్య అన్నారు.

దీనిని ఖుష్బూ విమర్శించింది. ఆయన నా దగ్గర ఉండి ఉంటే మహిళల గురించి వాడిన పదాలకు అర్థమేంటో చెప్పేదాన్నని, వాళ్లు దేశ వ్యతిరేకులని ఆమె కామెంట్ చేసింది. అయితే తన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకొని ప్రేమానంద్ జీ మహరాజ్ కి వ్యతిరేకంగా క్రియేట్ చేశారని కూడా ఆమె చెప్పింది.

ఈ ఘటన బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. ధర్మరక్షణ పేరుతో జరిగిన ఈ హింసాత్మక చర్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.