
📌 Key Points
- పాయల్ రాజ్పుత్ ‘RX 100’ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసి మంచి గుర్తింపు పొందింది.
- ప్రభాస్ ఫొటోలు షేర్ చేస్తూ, అతను అమాయకుడు, ముద్దుగా ఉంటాడని పాయల్ ట్వీట్ చేసింది.
- ట్వీట్లో ప్రభాస్ సిగ్గుపడతారని, దేవుడు ఆయన్ని దీవించుగాక అని పాయల్ పేర్కొంది.
- ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు.
టాలీవుడ్ నటి పాయల్ రాజ్పుత్ తన మనసులో మాటను బయటపెట్టి వార్తల్లో నిలిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఫొటోలు షేర్ చేస్తూ అతను ఎంత అమాయకుడో, ముద్దుగా ఉంటాడో వివరించింది. ఈ వైరల్ పోస్ట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసి, సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
పాయల్ రాజ్పుత్ కెరీర్ ప్రస్థానం
టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘RX 100’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత వెంకీ మామ, జిన్నా, తీస్మార్ ఖాన్, మంగళవారం, రక్షణ వంటి మూవీల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.
ఈ బ్యూటీ సినిమాలో నటించడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా పాయల్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘‘ఎవరైన అంత అమాయకంగా ఎలా ఉండగలరు’’ అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ వ్యక్తి ఇప్పటికీ సిగ్గుపడతాడు. ఎందుకు అతను అంత ముద్దుగా ఉంటాడు, దేవుడు అతన్ని దీవించుగాక అంటూ పోస్ట్ చేసింది’’ ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. ట్వీట్ ఇదే
ప్రభాస్ పై పాయల్ రాజ్పుత్ వైరల్ పోస్ట్
నెటిజన్ల ఆసక్తికర కామెంట్స్
పాయల్ రాజ్పుత్ చేసిన ఈ ట్వీట్ ప్రభాస్ అభిమానులను, సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. పాయల్ మాటలపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ, ఈ పోస్ట్ను మరింత వైరల్ చేస్తున్నారు.


