|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐఐటీ మద్రాస్‌లో అద్భుతం! జింక దాహార్తి తీర్చిన ‘సరళమ్మ’.. వీడియో చూస్తే కన్నీళ్లాగలేరు!

Published: 02-04-2026, 1:35 PM
ఐఐటీ మద్రాస్‌లో అద్భుతం! జింక దాహార్తి తీర్చిన 'సరళమ్మ'.. వీడియో చూస్తే కన్నీళ్లాగలేరు!
  • ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జింకకు కొబ్బరి నీళ్లు తాగిస్తున్న సరళమ్మ.
  • సరళమ్మ ఎన్నో ఏళ్లుగా క్యాంపస్‌లో కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు.
  • డాక్టర్ అనుపమ కశ్యప్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
  • సరళమ్మ దయాగుణాన్ని కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సరళమ్మ అనే మహిళ జింకకు కొబ్బరి నీళ్లు తాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె గొప్ప మనసు వెలుగులోకి వచ్చింది.

సరళమ్మ గొప్ప మనసును చాటిన వీడియో

పచ్చని చెట్లతో కళకళలాడే ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఒక మహిళ ఎంతో ఆప్యాయంగా ఓ జింకకు కొబ్బరి నీళ్లు తాగిస్తున్న వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియోలో కన్పిస్తున్న మహిళ నెటిజన్‌లకు కొత్త కానీ, ఆ క్యాంపస్ గురించి తెలిసిన వారికి, అక్కడి విద్యార్థులకు ఆ వీడియోలోని మహిళ సుపరిచితురాలే. ఆమె పేరు ‘సరళమ్మ’. ఎన్నో ఏళ్లుగా అదే క్యాంపస్‌లో కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ ఎన్నో తరాల విద్యార్థులకు ఆమె ఆత్మీయురాలిగా మారారు. క్యాంపస్‌లో మనుషులు, వన్యప్రాణుల మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని తరచుగా తన కెమెరాలో బంధించే డాక్టర్ అనుపమ కశ్యప్.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దృశ్యం వెలుగులోకి వచ్చింది.

నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న దృశ్యం

ఈ వీడియో సరళమ్మ గొప్ప మనసును మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోపై స్పందిస్తూ ఆమెతో ఉన్న పాత జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు. ‘యూపీఐ (UPI) లావాదేవీలు అందుబాటులో లేని ఆ రోజుల్లో, నోట్ల రద్దు (Demonetisation) సమయంలో చిల్లర లేక మేము కొబ్బరినీళ్లు కొనడం మానేశాం. అది గమనించిన సరళమ్మ, మా పరిస్థితి అర్థం చేసుకుని నాకు రూ.100 అప్పుగా ఇచ్చి సాయం చేశారు’ అని రాసుకొచ్చారు. వ్యాపారానికి అతీతమైన ఆమె దయాగుణానికి ఈ ఘటనే నిదర్శనమని పలువురు కొనియాడుతున్నారు.

ఐఐటీ మద్రాస్‌లో జీవవైవిధ్యం

ఐఐటీ మద్రాస్ క్యాంపస్ అద్భుతమైన జీవవైవిధ్యానికి ప్రసిద్ధి. ఇక్కడ జింకలు, కోతులు, వివిధ రకాల పక్షులు స్వేచ్ఛగా తిరుగుతూ దైనందిన జీవితంలో భాగమైపోయాయి. ఈ క్యాంపస్‌లో మనుషులు, జంతువుల మధ్య ఇలాంటి అరుదైన దృశ్యాలు కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో, క్యాంపస్ రోడ్డు మధ్యలో ఓ తల్లి జింక తన పిల్లకు పాలు ఇస్తుంటే.. ఎవరూ వాటిని బెదరగొట్టకుండా, నిశ్శబ్దంగా తమ వాహనాలను ఆపి వాటికి దారి ఇచ్చిన వీడియో కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

మనుషులు, జంతువుల మధ్య ప్రేమ, దయ ఇంకా సజీవంగా ఉన్నాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. సరళమ్మ లాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శం. ఆమె సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.