
📌 Key Points
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం ఇరాన్ స్పీకర్ పాకిస్తాన్ పర్యటన.
- ‘మినాబ్ 168’ విమానంలో మరణించిన చిన్నారుల జ్ఞాపకాలు.
- క్షేపణి దాడిలో మరణించిన 160 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల స్మృతి చిహ్నాలు.
- యుద్ధం మిగిల్చిన గాయాలను అమెరికాకు గుర్తు చేయడమే ప్రధాన ఉద్దేశ్యం.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ పాకిస్తాన్ పర్యటనకు ఒక ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆ విమానం పేరు ‘మినాబ్ 168’. ఇది అమెరికా దాడిలో మరణించిన చిన్నారుల జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.
‘మినాబ్ 168’ విమానం ప్రత్యేకత ఏమిటి?
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. అందరిని కదిలిస్తుంది. శాంతి చర్చల కోసం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ ఘాలిబఫ్ శనివారం పాకిస్తాన్ చేరుకున్నారు. అయితే, ఈ పర్యటనలో ఆయన ప్రయాణించిన విమానం మానవీయ కోణంలో ప్రపంచం హృదయాన్ని ద్రవింపజేస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్లోని మినాబ్ పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మరణించిన 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయుల స్మృత్యర్థం ఆ విమానానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. చర్చల బేరసారాల కంటే ముందు, యుద్ధం మిగిల్చిన మాయని గాయాలను అమెరికా ప్రతినిధులకు గుర్తుచేయడమే ఈ వినూత్న నిరసన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం గా తెలుస్తుంది.
విమానంలో నిశ్శబ్ద రోదన.. దృశ్యాలు
విమానమంతా ఆ పసికందుల జ్ఞాపకాలే..
శాంతి చర్చల్లో యుద్ధ విషాదం
సాధారణంగా దౌత్యపరమైన ప్రయాణాల్లో అధికారిక ప్రతినిధులు ఉంటారు. కానీ ఈ విమానంలోని సీట్లలో కేవలం నిశ్శబ్దమే రాజ్యమేలింది. విమానంలోని ప్రతి సీటును మినాబ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో చిన్నారికి కేటాయించారు. ఆ సీట్లలో మృతుల చిత్రపటాలను ఉంచడమే కాకుండా, దాడి జరిగిన సమయంలో వారు ధరించిన రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు, చిన్నారి బూట్లు, వాడిపోయిన పుష్పాలను అలంకరించి ఆ దృశ్యాలను అత్యంత హృదయ విదారకంగా మార్చారు. “ఈ ప్రయాణంలో నా తోటి సహచరులు వీరే” అంటూ ఘాలిబఫ్ షేర్ చేసిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పొరపాటున దాడి జరిగిందని అమెరికా చెబుతున్నప్పటికీ, కోల్పోయిన ఆ పసి ప్రాణాల వేదనను శాంతి చర్చల వేదికపైకి తీసుకురావడమే ఇరాన్ ఈ విధంగా తన నిరసనను వ్యక్తం చేసింది.
ఈ విధంగా ఇరాన్ తన నిరసనను తెలియజేసింది. అమెరికా పొరపాటుగా దాడి చేశామని చెబుతున్నప్పటికీ, ఆ పసి ప్రాణాలను కోల్పోయిన వేదనను శాంతి చర్చల వేదికపైకి తీసుకురావడమే ఇరాన్ లక్ష్యం.


