
పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. తాజాగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు జ్యోతి కృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Key Points
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాను మూడు సార్లు చూశారని దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు.
సినిమా రిలీజ్ వాయిదా పడుతూనే ఉండటంతో మార్కెట్లో బజ్ తక్కువగా ఉంది.
మచిలీపట్నంలో జరిగిన ఈవెంట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
జ్యోతి కృష్ణ 'హరిహర వీరమల్లు' తో హిట్ కొడతారా అన్నది చూడాలి.
‘హరిహర వీరమల్లు’ రిలీజ్ వాయిదా
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. సోషల్ మీడియాలో మాత్రం వేరే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాకు బయ్యర్లు దొరకట్లేదని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు పక్కనబెడితే మూవీని అధికారికంగా వాయిదా వేసినా సరే ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు. తాజాగా మచిలీపట్నంలో ఈవెంట్ నిర్వహించారు.
మచిలీపట్నం బీచ్ ఒడ్డున ‘హరిహర..’ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం జరిగింది. దీనికి హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ హాజరయ్యారు. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతికృష్ణ ఏమన్నారంటే.. ‘పవన్ కల్యాణ్.. ఒక్కసారి కాదు ఈ సినిమాని మూడు సార్లు చూశారు. గంటపాటు నన్ను మెచ్చుకున్నారు. మళ్లీ ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చారు. అసురన్ అనే పాటని అయితే ఏకంగా 500 సార్లు విన్నారు’ అని చెప్పుకొచ్చాడు.
జ్యోతి కృష్ణ కామెంట్స్ వైరల్
సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మాట్లాడటం బాగానే ఉంది. కాకపోతే రియాలిటీలో చూసుకుంటే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు మార్కెట్లో పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో రావాల్సిన ఈ మూవీ.. దాదాపు 11-12 సార్లు వాయిదా పడింది. దీంతో పవన్ అభిమానులే ఈ చిత్రం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదనిపిస్తుంది. అలాంటిది పవన్.. తన సినిమాని మూడుసార్లు చూడటం, మరో మూవీ చేస్తానని దర్శకుడికి మాటివ్వడం అంటే నెటిజన్లు సందేహపడుతున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?
సినిమా మార్కెట్ స్థితి
డైరెక్టర్ జ్యోతికృష్ణ విషయానికొస్తే.. నిర్మాత ఏఎం రత్నం కొడుకు. చాన్నాళ్లుగా డైరెక్షన్ చేస్తున్నాడు. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత కేడీ, ఊ ల లా లా అనే తమిళ చిత్రాలు చేశారు. తెలుగులో గోపీచంద్తో ‘ఆక్సిజన్’, కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’ తీశారు. ఇవన్నీ థియేటర్ దగ్గర ఆడలేదు. ఇప్పుడు కూడా క్రిష్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. మరి ‘హరిహర..’తోనైనా హిట్ కొడతారేమో చూడాలి?
చివరగా, ‘హరిహర వీరమల్లు’ సినిమా భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి. దర్శకుడు జ్యోతి కృష్ణకు ఇది ఒక పరీక్షా సమయం.


