|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘జ్యోతి రావు ఫూలే’ చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి

Published: 28-06-2025, 12:45 PM
‘జ్యోతి రావు ఫూలే’ చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ‘జ్యోతిరావు ఫూలే’ చిత్రాన్ని వీక్షించి ప్రశంసించారు. సాంకేతికత లేని కాలంలో జరిగిన ఈ చారిత్రక కథను చిత్రం అద్భుతంగా తెరకెక్కించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం మహిళా విద్యకు పూలే చేసిన కృషిని ప్రతిబింబిస్తుంది.

Key Points

1

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జ్యోతిరావు ఫూలే చిత్రాన్ని ప్రశంసించారు.

2

సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో జ్యోతిరావు ఫూలే చేసిన కృషిని చిత్రం చూపుతుంది.

4

టాక్స్ మినహాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసలు

హైదరాబాద్‌: చక్కటి సందేశాన్నిచ్చే జ్యోతిరావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలన్నారు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. ఈరోజు(శనివారం, జూన్‌ 28) పంజాగుట్ట పీవీఆర్‌ సినిమాస్‌లో జ్యోతిరావు ఫూలేచిత్రాన్ని చూసిన మహేష్‌ కుమార్‌ గౌడ్‌.. కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన కథను కళ్ళకు కట్టినట్లుగా పూలే చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.

జ్యోతిరావు ఫూలే జీవితం

సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే జ్యోతి రావు పూలే తన భార్యను చదివించాడు. మహిళలు చదువుకుంటే నేరంగా పరిగణించే రోజుల్లో అగ్రవర్ణ సమాజాన్ని ఎదురించి సావిత్రిబాయిని చదివించి యావత్ మహిళా లోకానికి నూతన ఒరవడి సృష్టించారు.

మహిళా విద్యపై దృష్టి

నేడు బహుజనులు చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చామంటే జ్యోతి రావు పూలే కృషి వల్లే. పూలే చిత్ర నిర్మాతలు  డైరక్టర్  చిత్రంలోని నటీనటులకు అభినందనలు. రాహుల్ గాంధీతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు  పులే చిత్రాన్ని వీక్షిస్తున్నారు. మన రాష్ట్రంలో పులే చిత్రానికి టాక్స్ మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. మన  భవిష్యత్తుకు ఆనాడు పూలే  ఎంత కృషి చేశారో ఈ చిత్రం ద్వారా అర్ధం అవుతుంది’ అని అన్నారు.

చిత్రం జ్యోతిరావు ఫూలే కృషిని ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రం మన భవిష్యత్తుకు ఆయన చేసిన కృషిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే, రాష్ట్ర ప్రజలందరూ ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.