
📌 Key Points
- కన్నడ నటి రమ్య సంచలన వ్యాఖ్యలు: మగవాళ్ళను కుక్కలతో పోల్చడం దుమారం రేపుతోంది!
- రమ్య పోస్ట్ వైరల్: ‘మగవాళ్ళ మనసు అర్థం చేసుకోవడం కష్టం, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు’!
- నెటిజన్ల ఆగ్రహం: రమ్య వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు, కేసు పెట్టాలని డిమాండ్!
- మనుషులకు, జంతువులకు తేడా లేదా? రమ్య పోలికపై మండిపడుతున్న నెటిజన్స్, దుమారం రేపుతున్న కామెంట్స్!
కన్నడ నటి రమ్య సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అసలు రమ్య ఏం మాట్లాడారు? ఎందుకు ఇంత వివాదం జరుగుతోంది? చూద్దాం!
మగవాళ్లను కుక్కలతో పోల్చిన రమ్య
Ramya: దేశంలో వీధి కుక్కల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మనుషులపై కుక్కల దాడులు అధికం అవుతున్నాయని సుప్రీమ్ కోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే, కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై డాగ్ లవర్స్ న్యాయ పోరాటాం చేస్తున్నారు. వీరిలో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
నెటిజన్ల ఆగ్రహం, విమర్శలు
అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కన్నడ నటి రమ్య(Ramya) ఈ వివాదంపై స్పదించింది. సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో మగవాళ్ళను కుక్కలతో పోల్చింది. ‘మగాళ్లను, వాళ్ళ మనసులను అర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఎప్పుడు రేప్ చేస్తారో, ఎవరిని చంపుతారో తెలుసుకోవడం కష్టం. మరి, వాళ్లందరినీ జైల్లో పెట్టాలా’ అంటూ రాసుకొచ్చింది.
దుమారం రేపుతున్న రమ్య కామెంట్స్
దీంతో నటి రమ్య చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపుతోంది. నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. మనుషులకు, జంతువులకు తేడా లేదా. మగాళ్లను కుక్కలతో పోల్చడం ఏంటి? కొంతమంది చేసిన తప్పులకు మగజాతినే ఇలా అనడం అనేది దారుణమైన పోలిక. రమ్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ అవుతుంది. ఆమెపై కేసులు పెట్టాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఈ వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. మరి నెటిజన్స్ చేస్తున్న ఈ కామెంట్స్ పై నటి రమ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.
రమ్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


