|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లీగల్ థ్రిల్లింగ్‌ వెబ్ సిరీస్.. తెలుగు వర్షన్‌ రిలీజ్‌పై ప్రకటన

Published: 31-07-2025, 12:49 AM
లీగల్ థ్రిల్లింగ్‌ వెబ్ సిరీస్.. తెలుగు వర్షన్‌ రిలీజ్‌పై ప్రకటన

తమిళంలో విడుదలై విజయవంతమైన ‘సట్టముం నీతియుం’ వెబ్ సిరీస్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను చేరుకోనుంది. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ థ్రిల్లర్ ఆగష్టు 1న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Key Points

‘సట్టముం నీతియుం’ తెలుగులో విడుదల

కోలీవుడ్ ‌ లో ఓటీటీ వేదికగా విడుదలైన ‘ సట్టముం నీతియుం ‘ వెబ్ ‌ సిరీస్ ‌ పై పాజిటీవ్ ‌ రెస్పాన్స్ ‌ వచ్చింది . అయితే , ఇప్పుడు ఈ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ రాబోతోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది . బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ‌ జీ 5 తమిళ్ ‌ లో జులై 18 న విడుదలై దూసుకెళ్తుంది . ఇందులో శరవణన్, నమ్రితా ఎంవీ ప్రధాన పాత్రలు పోషించారు .

ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలతో పాటు భావోద్వేగంతో కూడిన ‘ సట్టముం నీతియుం’ వెబ్ ‌ సిరీస్ ఆగష్టు 1 న తెలుగులో విడుదల కానుంది . జీ 5 వేదికగా తెలుగు , హిందీలో స్ట్రీమింగ్ ‌ కానుంది . తాజాగా మేకర్స్ ‌ ఒక పోస్టర్ ‌ ను విడుదల చేశారు . ఈ సిరీస్ సుందరమూర్తి ( శరవణన్ ) అనే ఓ లాయర్ చుట్టూ తిరుగుతుంది. కోర్టులో పేదవారికి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ చిత్రం ఉంటుంది . ఇది ఒక సామాన్యుడి ధైర్యాన్ని, న్యాయాన్ని సాధించేందుకు చేసే పోరాటాన్ని చూపించే కథగా రూపొందించబడింది. శక్తివంతమైన కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్‌గా నిలుస్తుందని చాలామంది రివ్యూలు ఇచ్చారు.

ఆగష్టు 1న జీ5లో స్ట్రీమింగ్

కోర్టు డ్రామా హైలైట్స్

శక్తివంతమైన కోర్టు డ్రామాగా ‘సట్టముం నీతియుం’ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. జీ5 వేదికగా దీన్ని ఆస్వాదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.