
టాలీవుడ్లో హీరోయిన్గా తన అడుగులు వేస్తున్న శివాని రాజశేఖర్, 100 కోట్ల బడ్జెట్ మెగా హీరో సినిమాను రిజెక్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయానికి కారణమేమిటో తెలుసుకుందాం.
Key Points
శివాని రాజశేఖర్ 'ఉప్పెన' సినిమాలోని బోల్డ్ సీన్ల కారణంగా ఆఫర్ను రిజెక్ట్ చేసింది.
ఆమె నిర్ణయం వల్ల కృతి శెట్టికి అవకాశం లభించింది.
'ఉప్పెన' సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
శివాని కుటుంబ ప్రేక్షకులకు అనుకూలమైన సినిమాలకు మాత్రమే ఆసక్తి చూపుతోంది.
శివాని రాజశేఖర్ యొక్క నిర్ణయం
సినిమా ఇదోక రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. స్టార్డమ్ కోసం ఎంతో మంది యంగ్ బ్యూటీస్ ఎలా పోరాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు దుమ్మురేపుతున్న ఈ కాలంలో, చిన్న సినిమాలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. అలాంటి సమయంలో సినిమా ఆఫర్ రావడం అనేది కొత్త హీరోయిన్కి పెద్ద అవకాశమే. అయితే, కొంతమంది మాత్రం తమకు వచ్చిన అవకాశాలను వదులుకోవడం వల్ల తమ కెరీర్కే తామే బ్రేకులు వేసుకుంటున్నారు. అలా ఓ హీరోయిన్ మెగా హీరో, భారీ బ్లాస్టర్ మూవీని రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
ఆమె హీరోయిన్ ఎవరో కాదు. టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో రాజశేఖర్ – జీవిత దంపతుల కూతురు శివాని. ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో శివాని రాజశేఖర్ ప్రస్తుతం హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. 2021లో ‘అద్భుతం’చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, అంతకుముందు శ్రీలీలా–రోషన్ జంటగా నటించిన ‘పెళ్లి సందD’లో కూడా మెరిసింది. కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉండే సినిమాలకు మాత్రమే ఓకే చెబుతూ వస్తోన్న శివాని, తనకు వచ్చిన ఆఫర్లను జాగ్రత్తగా ఎంచుకుంటోంది.
‘ఉప్పెన’ సినిమా విజయం
అయితే.. ఈ క్రమంలో శివాని రాజశేఖర్. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’లో హీరోయిన్ ఛాన్స్ వదులుకుందట. ఈ విషయాన్ని శివానీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే.. ఆ కథలో ఉన్న బోల్డ్ కంటెంట్ కారణంగా శివాని ఆ ప్రాజెక్ట్కి నో చెప్పిందట. ఈ విషయంపై శివానీ మాట్లాడుతూ.. “ఉప్పెన సినిమా ఆఫర్ నాకు వచ్చింది. కానీ ఆ సినిమా మొదటి కథ చాలా బోల్డ్గా రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్లో లిప్లాక్స్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. నేను అప్పట్లో అలాంటి సీన్స్ చేయడానికి కంఫర్ట్గా లేను. భయం వేసింది. ఇప్పటికీ అలాంటి సీన్స్ చేయాలంటే నన్ను నేను కన్విన్స్ చేసుకోవాలి. అందుకే ఆ సినిమా వదులుకున్నా’ అని చెప్పుకొచ్చింది.
శివాని రాజశేఖర్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో ఆ లక్కీ ఛాన్స్ కృతి శెట్టి కొట్టేసింది. ఉప్పెనతో హీరోయిన్గా పరిచయం అయిన కృతి ఒక్కసారిగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నిలిచింది. తొలి సినిమానే బ్లాక్బస్టర్ కావడం, అలాగే సినిమా రూ. 100 కోట్ల మార్క్ దాటడంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ మారిపోయింది. మరోవైపు శివాని మాత్రం ఉప్పెన లాంటి భారీ సినిమా వదులుకోవడం వల్ల కెరీర్లో భారీ సక్సెస్ ను కోల్పోయింది. ఇప్పటివరకు ఆమె ‘అద్భుతం’, ‘విద్య వాసుల అహం’, ‘కోట బొమ్మాళి పీఎస్’ వంటి చిత్రాల్లో నటించి, మెప్పించింది. కానీ, ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఉప్పెన అలాంటి బ్లాక్బస్టర్ హిట్స్ ఆమె కెరీర్ లో లేవు అనే చెప్పాలి.
కృతి శెట్టి కెరీర్లో మలుపు
ఏదేమైనా, శివాని తన లిమిట్స్కి కట్టుబడి ఉండడం మంచిదే కానీ, ఒక మెగా హీరో సినిమా వదులుకోవడం కెరీర్ను ఎంతగానో ప్రభావితం చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
చివరగా, శివాని రాజశేఖర్ తనకు తగ్గ పాత్రలను ఎంచుకోవడంలో నిబద్ధత చూపింది. ‘ఉప్పెన’ వంటి భారీ అవకాశాన్ని వదులుకోవడం ద్వారా ఆమె తన విలువలను నిలబెట్టుకుంది.

