
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న SSMB 29 చిత్రం గురించి అత్యంత ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇటలీ పర్యటన సమయంలో మహేశ్ బాబు కొత్త లుక్ బయటపడింది. గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఆయన కనిపించడం విశేషం.
Key Points
SSMB 29 చిత్రంలో మహేశ్ బాబు గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో కనిపించారు.
ఇటలీ పర్యటన సమయంలో మహేశ్ బాబు లుక్ బయటపడింది.
రాజమౌళి దర్శకత్వంలోని చిత్రంలో మహేశ్ బాబు భిన్నమైన లుక్తో కనిపించనున్నారు.
SSMB 29 చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కూడా నటిస్తున్నారు.
మహేశ్ బాబు లేటెస్ట్ లుక్
మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ చేశారు. త్వరలో మరో షెడ్యూల్ కూడా మొదలుపెట్టబోతున్నారు. కానీ SSMB 29 గురించి అధికారికంగా మాత్రం ప్రకటించలేద. మహేశ్ అయితే పూర్తిగా బయట కనిపించడమే మానేశాడు.
కొన్నిరోజుల క్రితం షూటింగ్ లో బ్రేక్ దొరకగానే కుటుంబంతో కలిసి మహేశ్.. ఇటలీ వెళ్లాడు. కానీ తన ఫొటో గానీ, లుక్ గానీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎయిర్ పోర్ట్ లోనూ తలపై క్యాప్, కళ్లజోడు ఉండటం వల్ల మహేశ్ లుక్ సరిగా రివీల్ కాలేదు.
SSMB 29 చిత్రీకరణ విశేషాలు
మరి తాజాగా ఎవరితోనూ ఏదో డిస్కషన్ చేస్తున్న టైంలో మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ బయటపడింది. గుబురు గడ్డంతో, పొడవైన జుత్తుతో మహేశ్ కనిపించాడు. గతంలో మహేశ్ హెయిర్ పెంచాడు గానీ రాజమౌళితో మూవీ కోసం మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది.
చిత్ర విడుదల తేదీ
గతంలో ఒడిశాలో షూటింగ్ చేస్తున్న టైంలో మహేశ్ క్లిప్ ఒకటి లీకైంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా కనిపించాడు. మరోవైపు ఇదే సినిమాలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర చేస్తోంది. వీళ్ల లుక్స్ కూడా బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మూవీ 2027లో థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి?
మహేశ్ బాబు కొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 2027 విడుదల తేదీ నిర్ధారణ కావాల్సి ఉంది.


