
📌 Key Points
- నటి లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ నిర్దోషిగా విడుదల.
- తన మాజీ భార్య మంజు వారియర్, మీడియా, పోలీసులే కుట్ర పన్నారని దిలీప్ ఆరోపణ.
- ఈ కేసులో తాను నిందితుడిని కానని, ‘నిజమైన బాధితుడిని’ తానేనని వ్యాఖ్య.
- సరైన సాక్ష్యాలు లేనందున దిలీప్ను విడుదల చేసిన కోర్టు, ఆరుగురిని దోషులుగా తేల్చింది.
మలయాళ నటుడు దిలీప్కు నటి లైంగిక వేధింపుల కేసులో ఊరట లభించింది. కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ.. తన మాజీ భార్య మంజు వారియర్, మీడియా, పోలీసులే తనపై కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ తీర్పు తనపై పడిన మచ్చను తొలగించిందని ఆయన అన్నారు.
దిలీప్కు ఊరట: సంచలన ఆరోపణలు
మలయాళం నటుడు దిలీప్ కు పెద్ద ఊరట లభించింది. తనపై ఉన్న నటి లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు.. తన మాజీ భార్య, నటి మంజు వారియర్, ఓ వర్గం మీడియా, కొందరు పోలీసులే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు.
కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ (Dileep) సోమవారం (డిసెంబర్ 8) నిర్దోషిగా విడుదలయ్యాడు. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చిన దిలీప్.. తన మాజీ భార్య, నటి మంజు వారియర్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, “నిజమైన బాధితుడిని” తానేనని వ్యాఖ్యానించాడు.
మంజు వారియర్ వల్లే ఇదంతా..
మంజు వారియర్పై తీవ్ర ఆరోపణలు
“నా కెరీర్, ఇమేజ్, సమాజంలో నాకున్న గౌరవాన్ని దెబ్బతీయడానికే ఇదంతా చేశారు. అసలు ఈ కేసులో ఏదో కుట్ర దాగి ఉందని అందరికంటే ముందు చెప్పింది మంజు వారియరే. ఆమె ఆ మాట చెప్పినప్పటి నుంచే నాపై కుట్ర మొదలైంది” అని దిలీప్ ఆరోపించాడు.
అంతేకాకుండా ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక ‘మహిళా పోలీస్ అధికారిని’, కొంతమంది ‘క్రిమినల్ పోలీసులను’ ఆమె స్వయంగా ఎంచుకుందని దిలీప్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
కుట్ర వెనుక పోలీసులు, మీడియా పాత్ర
పోలీసులు అబద్ధపు కథ అల్లారు
అయితే దీనిపై ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ సోమవారం (డిసెంబర 8) తీర్పునిస్తూ.. ప్రధాన నిందితుడు పల్సర్ సునీతో సహా ఆరుగురిని దోషులుగా తేల్చారు. సరైన సాక్ష్యాలు లేనందున దిలీప్ సహా మరో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు.
ఈ తీర్పుతో దిలీప్కు ఊరట లభించినప్పటికీ, ఆయన చేసిన ఆరోపణలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేసులో కీలక మలుపు తిరిగిన ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


