
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన కెరీర్ లో ఎదుర్కొన్న సవాళ్ళు, ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ సినిమాతో సాధించిన విజయం గురించి తన భావాలను పంచుకున్నాడు. సినిమాలో నటించవద్దని చాలామంది హెచ్చరించినప్పటికీ, నిర్మాతల నమ్మకం తన కుటుంబాన్ని కాపాడిందని ఆయన తెలిపారు.
Key Points
మిరాయ్ సినిమాతో మంచు మనోజ్ అద్భుతమైన కమ్ బ్యాక్.
సినిమాలో విలన్ గా ఆకట్టుకున్న నటన.
చిత్ర నిర్మాతలపై మనోజ్ కన్నీటితో కూడిన ధన్యవాదాలు.
కుటుంబాన్ని నిలబెట్టినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు.
మిరాయ్ సినిమా సక్సెస్
టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస హిట్లతో అదరగొట్టాడు మంచు మనోజ్. కానీ ఫ్యామిలీలో ప్రాబ్లెమ్స్ తో సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ గానూ స్ట్రగుల్ పడ్డారు. ఇప్పుడు ఆయన మిరాయ్ సినిమాతో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇందులో విలన్ గా వేరే స్థాయిలో యాక్టింగ్ కనబరిచారు. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వస్తోంది. మూవీ సక్సెస్ ఈవెంట్ ను శనివారం (సెప్టెంబర్ 13) హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.
శనివారం హైదరాబాద్ లో ‘ మిరాయ్ ‘ సక్సెస్ ఈవెంట్ లో మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యాడు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ ల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను చేర్చుకోవద్దని చాలా మంది చెప్పి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
“నేను చివరిసారిగా ఇలా సక్సెస్ మీట్ వేదికపై కనిపించి 10-12 సంవత్సరాలు అయింది. ఇది ఇప్పటికీ కలలాగానే ఉంది. నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తిరిగి కాల్ చేయడానికి కొంత సమయం పట్టింది” అని మనోజ్ అన్నాడు.
మంచు మనోజ్ భావోద్వేగ ప్రసంగం
మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ కు ధన్యవాదాలు చెబుతూ మనోజ్ ఇలా అన్నాడు. “నేను ఎప్పుడూ బయట చెప్పలేదు. కానీ నేను పెరిగిన విధంగా నేను నా పిల్లలను చూసుకోగలనా అనే అంతర్గత భయం నాకు ఉంది. ఇప్పుడు ఆ భయం నాకు లేదు. నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టారు” అని మంచు మనోజ్ అన్నాడు.
“హనుమాన్ టీజర్ విడుదలయ్యే ముందే ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్.. తేజ సజ్జా , నా మీద నమ్మకం ఉంచాడు. నేను చాలా కాలంగా నటించకపోవడం వల్ల, నన్ను ఇలాంటి పెద్ద సినిమాలో చేర్చుకోవద్దని చాలామంది అతనికి కచ్చితంగా చెప్పి ఉంటారు. కానీ అతను నా మీద, నా టాలెంట్ మీద నమ్మకం ఉంచాడు. దానికి అతనికి సలాం” అని మనోజ్ చెప్పాడు.
కుటుంబంపై మనోజ్ ఆవేదన
మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్. ఇటీవల వాళ్ల ఫ్యామిలీ గొడవలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2004 లో ‘దొంగా దొంగది’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసే ముందు మనోజ్ బాల నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. 2015 లో అతను ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. అయితే ప్రణతితో విడాకులు తీసుకున్నాడు. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మనోజ్ సినిమాలకు విరామం ఇచ్చాడు.
2023 లో అతను భూమా మౌనికను వివాహం చేసుకున్నాడు. వారికి 2024లో కుమార్తె జన్మించింది. మౌనికకు మునుపటి వివాహం నుండి కుమారుడు కూడా ఉన్నాడు. 2025 లో మనో..జ్ బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ తో కలిసి నటించిన ‘భైరవం’ సినిమాతో సినీ రంగంలోకి తిరిగి వచ్చాడు. కానీ అది సో-సో రెస్పాన్స్ అందుకుంది. అతను త్వరలో ‘వాట్ ది ఫిష్’ సినిమాలో కనిపించనున్నాడు.
మంచు మనోజ్ యొక్క కష్టాలను, విజయాలను ప్రతిబింబించే ఈ కథనం, కుటుంబం, కెరీర్ల మధ్య సమతుల్యతను సాధించడం ఎంత కష్టమో చూపుతుంది. మిరాయ్ సినిమా ఆయనకు మంచి జీవితాన్ని అందించిందని తెలుస్తోంది.


