
జూన్ 27న విడుదల కాబోతున్న ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వరుస ఫ్లాప్స్ తర్వాత తనకు మళ్ళీ ఫ్యాన్స్ పెరుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Key Points
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత, 'కన్నప్ప' సినిమాతో మళ్ళీ ఫ్యాన్స్ను సంపాదించుకోవాలని ఆశిస్తున్నారు.
ఫ్యాన్స్ తమ డబ్బు, సమయం, ఆలోచనలను సినిమాలపై పెడతారని, వారిని మెప్పించడం ముఖ్యమని విష్ణు అభిప్రాయపడ్డారు.
ప్రేక్షకులను మెప్పించేలా మంచి సినిమాలు చేయాలని విష్ణు తన సంకల్పాన్ని వెల్లడించారు.
కన్నప్ప సినిమా ప్రమోషన్స్
Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప సినిమాతో జూన్ 27న రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్.. లాంటి స్టార్స్ తో ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు విష్ణు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఫ్యాన్స్ గురించి కామెంట్స్ చేసాడు.
ఫ్యాన్స్ గురించి విష్ణు వ్యాఖ్యలు
మంచు విష్ణు మాట్లాడుతూ.. నాన్న గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నేను వరుసగా ఫ్లాప్ సినిమాలు ఇచ్చి ఫ్యాన్స్ ని పోగొట్టుకున్నాను. కన్నప్ప తర్వాత మళ్ళీ నాకు ఫ్యాన్స్ పెరుగుతారు. మనం రెగ్యులర్ గా మంచి సినిమాలు ఇచ్చి ఫ్యాన్స్ ని సంతృప్తిపరచాలి. లేకపోతే ఈ రోజుల్లో ఫ్యాన్స్ వేరే హీరోలకు షిఫ్ట్ అయిపోతారు. ఫ్యాన్స్ వాళ్ళ డబ్బులు, టైం, ఆలోచనలు మన మీద పెడతారు కాబట్టి వాళ్ళని మన సినిమాలతో మెప్పించాలి. లేకపోతే వాళ్ళని మెప్పించే హీరోలకు ఫ్యాన్స్ గా మారతారు అని ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసారు.
ఫ్లాప్ సినిమాల తర్వాత ఆశలు
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా మంచి సినిమాలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.


