|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manisha Koirala: హీరామండి మల్లికాజాన్‌కు అరుదైన గౌరవం.. అదేంటంటే?

Published: 18-07-2025, 7:52 AM
Manisha Koirala: హీరామండి మల్లికాజాన్‌కు అరుదైన గౌరవం.. అదేంటంటే?

ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాకు యూకేలోని బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన హీరామండి వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు ఈ గుర్తింపు దక్కింది.

Key Points

1

మనీషా కొయిరాలాకు బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

2

హీరామండి వెబ్ సిరీస్‌లో మల్లికాజాన్ పాత్రలో మనీషా నటించింది.

4

ఈ గౌరవం తన కృషికి, వైఫల్యాలను ఎదుర్కొన్నందుకు గుర్తుగా ఉందని మనీషా పేర్కొంది.

గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న మనీషా

చాలా ఏళ్ల తర్వాత లస్ట్ స్టోరీస్ ‌ తో గ్రాండ్ ‌ గా రీ ఎంట్రీ సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది . యూకేకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ‌ ను అందించింది . ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మనీషా కొయిరాలా . తాను డాక్టరేట్ స్వీకరించిన వీడియోను షేర్ చేసింది . తన జీవితంలో సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా ఈ స్థానానికి చేరుకోలేదని చెప్పింది.

కాగా .. నటి మనీషా కొయిరాలా ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకుంది. ఈ గుర్తింపు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది . ఈ గౌరవం నేను మాటల్లో చెప్పలేనంత ఎక్కువ అని తెలిపింది . నా కృషి, వైఫల్యాలను ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని పేర్కొంది . మన ప్రయాణం ఎక్కడ మొదలైనా .. చివరికీ ఎక్కడికి చేరుకున్నామనేది ముఖ్యమని మనీషా తన పోస్ట్ ‌ లో ప్రస్తావించింది . తనను గుర్తించిన బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు అంటూ పోస్టే చేసింది .

హీరామండిలో మల్లికాజాన్ పాత్ర

మనీషా తన ఇన్ ‌ స్టాలో రాస్తూ .. ‘ బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది . ముఖ్యంగా యూకే సిటీ ఆఫ్ కల్చర్ -2025 ఏడాదిలో అందుకోవడం మరో విశేషం . క్రియేటివ్ డైరెక్టర్, ప్రతిభావంతులైన డేనియల్ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది . 2025 కు అభినందనలు .. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది ‘ పోస్ట్ చేసింది .

మనీషా కొయిరాలా సినీ జీవితం

ఇక సినిమాల విషయానికొస్తే మనీషా కొయిరాలా సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది . ఆ తర్వాత 1942: ఎ లవ్ స్టోరీ , బాంబే , అగ్ని సాక్షి , గుప్త్: ది హిడెన్ ట్రూత్ , దిల్ సే , కంపెనీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది . ఆ తర్వాత సినిమాలకు దూరమైన మనీషా చాలా కాలం తర్వాత లస్ట్ స్టోరీస్ (2018) తో రీ ఎంట్రీ ఇచ్చింది . ఆమె చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (2024) లో నటించింది . ఇందులో మల్లికాజాన్ అనే వేశ్య పాత్రను పోషించింది. విభజనకు ముందు కాలంలో లాహోర్‌లోని హీరా మండిలో నవాబులు , బ్రిటిష్ అధికారులతో వేశ్యల జీవితాలు ఎలా ఉన్నాయనే కోణంలో ఈ సిరీస్ ‌ ను తెరకెక్కించారు .

మనీషా కొయిరాలాకు లభించిన గౌరవ డాక్టరేట్ ఆమె కెరీర్‌కు నిదర్శనం. హీరామండి సిరీస్ తో ఆమె నటనకు మరోక అరుదైన గుర్తింపు లభించింది. భవిష్యత్తులో ఆమె మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.