
📌 Key Points
- మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ జనవరి 9న విడుదల కానుంది.
- మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్. సంజయ్ దత్ కీలక పాత్రలో.
- మారుతి మెసేజ్: భావోద్వేగ సమతుల్యతతో దేన్నైనా, దయ్యాన్ని కూడా ఎదుర్కొనవచ్చు.
- సినిమాలోని నానమ్మ-మనవడి ఎమోషన్స్ వాస్తవం; దయ్యం కథ కల్పితమని తెలిపారు.
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి ఈ సినిమా ద్వారా తాను ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఏంటో స్పష్టం చేశారు. దయ్యాలను ఎదుర్కొనే ధైర్యం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
“రాజాసాబ్” విడుదల వివరాలు
Director Maruthi : మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా హారర్ ఫాంటసీ జానర్లో రాజాసాబ్ సినిమా జనవరి 9న రాబోతున్న సంగతి తెలిసిందే. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్.. లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.(Director Maruthi)
మారుతి కీలక వ్యాఖ్యలు: అసలు మెసేజ్ ఇదే!
తాజాగా మారుతి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి పలు అంశాలు తెలిపారు. ఈ క్రమంలో మీ ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని మారుతీని అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
దయ్యాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎక్కడ?
మారుతీ సమాధానమిస్తూ.. ప్రతి మనిషికి ఎమోషన్స్ అవసరం. నీ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ గా ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. అలాగే ఎంత పెద్ద దయ్యం అయినా, దేన్నైనా నువ్వు మెంటల్ గా ధైర్యంగా ఉంటే ఎదురించగలవు అని ఈ సినిమాలో కొత్త స్క్రీన్ ప్లే తో చెప్పాను. ఈ సినిమాలో ఉన్న నానమ్మ – మనవడు ఎమోషన్ ఎలా ఉంటుంది అని రియల్ ఎమోషన్స్ నుంచి తీసుకున్నాను. దయ్యం కథ కల్పితం అని తెలిపారు.
మొత్తంగా, ‘రాజాసాబ్’ కేవలం హారర్ ఫాంటసీ సినిమానే కాకుండా, మారుతి చెప్పినట్లు భావోద్వేగ సమతుల్యత ఆవశ్యకతను తెలియజేసే ఓ సందేశాత్మక చిత్రమని తెలుస్తోంది. ఈ కొత్త స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.


