
ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన ‘బైసన్’ సినిమా తమిళంలో భారీ విజయం సాధించింది. 5 రోజుల్లో రూ. 35 కోట్ల కలెక్షన్స్తో ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుంది.
Key Points
ధ్రువ్ విక్రమ్ 'బైసన్' 5 రోజుల్లో ₹35 కోట్ల వసూళ్లు సాధించింది.
ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
తమిళ్ తర్వాత 'బైసన్' అక్టోబర్ 24న తెలుగులో విడుదల కానుంది.
కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.
‘బైసన్’ భారీ వసూళ్లు.. ధ్రువ్ కెరీర్ బెస్ట్
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison).. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. అక్టోబర్ 17న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన బైసన్ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
తెలుగులో ‘బైసన్’ విడుదల ఎప్పుడు?
బైసన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే కోలీవుడ్లో విడుదలైంది. దీంతో మొదటిరోజు అనుకున్నంత రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు. కానీ, సినిమా బాగుందని టాక్ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్లో మాత్రమే బైసన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో కూడా అక్టోబర్ 24న విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ అయితే ఇక్కడ కూడా ధ్రువ్ మార్కెట్ పెరగనుంది. ఫైనల్గా వంద కోట్లకు దగ్గర్లో బైసన్ కలెక్షన్స్ ఉండొచ్చని అంచనా వేయవచ్చు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.
కబడ్డీ ఆటగాడి కథ, ప్రధాన నటీనటులు
ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్ను గుర్తు చేశారు.
‘బైసన్’ తమిళంలో అంచనాలకు మించి విజయం సాధించింది. ధ్రువ్ విక్రమ్ నటన, కబడ్డీ కథ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రం వసూళ్లు సాధిస్తుందని, వంద కోట్లకు చేరువయ్యే అవకాశం ఉందని అంచనా.


