
📌 Key Points
- బంగారం బ్యూటీ మీరా చోప్రా రీఎంట్రీ అదిరింది, నిర్మాతగా కొత్త అవతారం!
- విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి కాంబోలో ‘గాంధీ టాక్స్’ మూవీ నిర్మించిన మీరా చోప్రా!
- జనవరి 30న విడుదలైన ‘గాంధీ టాక్స్’ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది!
- త్వరలో నటిగా కూడా మీరా చోప్రా సందడి చేయనున్నారని సమాచారం!
టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా మెరిసిన మీరా చోప్రా ఇప్పుడు నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె నిర్మించిన ‘గాంధీ టాక్స్’ మూవీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.
నిర్మాతగా మారిన మీరా చోప్రా
తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా నటించిన తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మీరా చోప్రా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ‘వాన’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వరుస విజయాలతో ఫుల్ జోష్లో కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలో ఎం. ఎస్. రాజు నిర్మించిన చిత్రం కావడంతో ‘వాన’ మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
‘గాంధీ టాక్స్’ మూవీ విశేషాలు
కానీ ఈ సినిమాలోని మీరా చోప్రా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో ఆ వెంటనే ఈమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘బంగారం’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ ముద్దుగుమ్మ బ్యాడ్ లక్, ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ ఈమె వేరే భాషల సినిమాల్లో నటిస్తూ చాలా కాలం మంచి దశలోనే కెరీర్ను కొనసాగించింది. కానీ గత కొన్నేళ్లుగా ఈమె ఏ సినిమాలో నటించడం లేదు.
మళ్ళీ నటిగా మీరా చోప్రా?
ప్రస్తుతం ఈమె వయసు 42 సంవత్సరాలు. ఈ వయసులో ఈమె మళ్లీ సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు, నిర్మాతగా ఇచ్చింది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘గాంధీ టాక్స్’ అనే తమిళ చిత్రాన్ని నటి మీరా చోప్రా నిర్మించారు. ఈ సినిమా జనవరి 30వ తేదీన విడుదల అయింది. ఈమె సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మీరా చోప్రా నిర్మాతగా తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తారో చూడాలి. ఆమె నటిగా కూడా తిరిగి వస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


