
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న ‘మన శంకరవరప్రసాద్గారు’ సినిమాలోని ‘మీసాల పిల్ల’ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట నంబర్ వన్ ప్లేస్లో ట్రెండింగ్లో ఉంటూ 30 మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతోంది.
Key Points
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'మన శంకరవరప్రసాద్గారు' సినిమా వస్తోంది.
'మీసాల పిల్ల' సాంగ్ యూట్యూబ్లో నంబర్ వన్గా ట్రెండ్ అవుతోంది.
ఈ పాట 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్తో దూసుకుపోతోంది.
ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించిన ఈ పాటకు భీమ్స్ సంగీతం అందించారు.
‘మీసాల పిల్ల’ పాట సంచలనం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ మరో బ్లాక్ బస్టర్ కోసం రెడీ అయిపోయాడు.
యూట్యూబ్లో రికార్డు వ్యూస్
ఇటీవలే ఈ మూవీ నుంచి మీసాల పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్లో నంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ పాట 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్ఫామ్స్లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు.
‘మన శంకరవరప్రసాద్గారు’ సినిమా విశేషాలు
కాగా.. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
మొత్తంగా, ‘మీసాల పిల్ల’ పాట తన అద్భుతమైన విజయం, భారీ వ్యూస్తో సినిమాపై అంచనాలను పెంచింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


