
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురి పెళ్లి సంబరాలు ముగియకముందే, కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే షాక్ అవ్వడం ఖాయం!
Key Points
మెహర్ రమేష్ కుటుంబంలో తీరని విషాదం, కూతురి పెళ్లి తర్వాత షాకింగ్ ఘటన.
చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర అకాల మరణం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణం.
విజయవాడలో తుదిశ్వాస విడిచిన జ్యోతి, మెహర్ రమేష్ ఎమోషనల్ ట్వీట్ వైరల్.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ హాజరైన పెళ్లి వేడుకలు, ఇప్పుడు శోకసంద్రంలో కుటుంబం.
పెళ్లి సంబరాల తర్వాత ఊహించని విషాదం!
Meher Ramesh: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే తన కూతురి పెళ్లితో రమేష్ కుటుంబంలో సంతోషం నిండింది. కానీ ఇప్పుడు అతని ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. అసలు ఏమైందో ఇక్కడ చూసేయండి.
Meher Ramesh: తెలుగు చిత్రసీమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మొన్ననే కుమార్తె పెళ్లిని అతను అంగరంగ వైభవంగా జరిపించాడు. కానీ ఇప్పుడేమో అతని చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర అకాల మరణం చెందడంతో మెహర్ రమేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్.. గుండెలు పగిలే నిజం!
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. జూలై 21 రాత్రి ఆమె పరిస్థితి క్షీణించి, రాత్రి 9.45 గంటలకు విజయవాడలో జ్యోతి తుదిశ్వాస విడిచినట్లు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతను తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాడు.
పెళ్లి సందడి తీరకముందే ఘోరం
కుటుంబానికి తీరని లోటు.. సినీ ప్రముఖుల సంతాపం!
పెళ్లి సందడి ముగిసి, ఆ జ్ఞాపకాల నుంచి తేరుకోకముందే ఆమె అనారోగ్యం బారినపడి కన్నుమూయడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరంజీవి , పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తదితర ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.
‘‘నా ప్రియమైన చిన్నక్క “మెహెర్ జ్యోతి సుంకర ”. ఈ రోజు 9:45 pm కి విజయవాడ లో స్వర్గస్తులైనారు. వైరల్ న్యూమోనియా తో గత 14 రోజులు గా చికిత్స పొందుతూ అనంత లోకాలకి వెళ్లి పోయారు. నా చిన్నప్పటి నుంచి తను నా అండ. ప్రేమ గా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి ,శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనంద పడిన మా అక్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకి ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు’’ అని మెహర్ రమేష్ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.
మెహర్ రమేష్ కుటుంబంలో జరిగిన ఈ విషాదం సినీ వర్గాలను కలచివేసింది. ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ను చూస్తూనే ఉండండి!
