
సెప్టెంబర్ 12న విడుదలైన ‘మిరాయ్’ మరియు ‘కిష్కింధపురి’ సినిమాలు ఓటీటీలో ఎప్పుడు రాబోతున్నాయో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వేరువేరు జోనర్లలో ఉన్న ఈ రెండు సినిమాల విడుదల వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Key Points
తేజ సజ్జా నటించిన 'మిరాయ్' సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ నటించిన 'కిష్కింధపురి' ఓటీటీ విడుదల తేదీ త్వరలోనే ప్రకటించబడుతుంది.
రెండు సినిమాలు వేరువేరు జోనర్లలో విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మిరాయ్ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.
మిరాయ్ ఓటీటీ విడుదల వివరాలు
ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతాయా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తుంటారు. వారికి తగినట్లుగానే ప్రతివారం సరికొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అయితే, థియేట్రికల్ రిలీజ్ కాగానే ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయని తెలిసిందే.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయిన రెండు సరికొత్త సినిమాల ఓటీటీ ప్లాట్ఫామ్స్పై బజ్ నెలకొంది. ఆ రెండు సినిమాలే మిరాయ్, కిష్కింధపురి. వేరు వేరు జోనర్లలో విడుదలైన ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి.
అయితే, కొన్ని ఫాల్స్ ఉన్నప్పటికీ అంతిమంగా రెండు సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. మరి ఈ రెండు సినిమాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ , డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.
కిష్కింధపురి ఓటీటీ విడుదల వివరాలు
తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్గా నటించిన సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీయా సరన్, జగపతి బాబు, జయరాం, రితికా నాయర్ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలైన మిరాయ్ సినిమాకు మంచి అప్లాజ్ వస్తోంది.
విజువల్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్, అడ్వెంచర్ సూపర్గా ఉన్నాయంటూ మిరాయ్ సినిమాను పొగుడుతున్నారు. అలాగే, మంచు మనోజ్ విలనిజం అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా మిరాయ్ సినిమాకు గౌర హరి ఇచ్చిన బీజీఎమ్ హైలెట్గా నిలిచిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మిరాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే, మూవీ రిలీజ్కు ముందే మిరాయ్ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. సుమారు రూ. 40 కోట్లకు జియో హాట్స్టార్ మిరాయ్ ఓటీటీ హక్కుల ను సొంతం చేసుకుందని సమాచారం. కాబట్టి జియో హాట్స్టార్లోనే మిరాయ్ ఓటీటీ రిలీజ్ కానుంది.
రెండు సినిమాల ప్రత్యేకతలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా కిష్కింధపురి. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 12న మిరాయ్తోపాటు కిష్కింధపురి సినిమా కూడా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే, కథ రొటీన్ టెంప్లేట్లో ఉన్నప్పటికీ భయపెట్టే కొన్ని సీన్స్ హారర్ లవర్స్కు మంచి థ్రిల్ పంచేలా ఉన్నాయని రివ్యూలో తెలిపారు. సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ బాగుందని ప్రశంసలు వచ్చాయి. ఈ క్రమంలో కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్ ఇంట్రెస్టింగ్గా మారింది.
కిష్కింధపురి ఓటీటీ రైట్స్ను జీ5 సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. కాబట్టి, జీ5లో కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. కిష్కింధపురి, మిరాయ్ రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్కు నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కలెక్షన్స్, టాక్ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్స్లలో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది.
చివరగా, రెండు సినిమాలూ ప్రేక్షకులను వినోదపరిచాయి. మిరాయ్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుండగా, కిష్కింధపురి ఓటీటీ విడుదల తేదీ కోసం ఎదురు చూడాల్సి ఉంది.


