
ప్రముఖ నటుడు నాగార్జున దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమ కుమారుడు అఖిల్ వివాహానికి ఆహ్వానించేందుకు వారు సీఎంను కలిశారని తెలుస్తోంది. అఖిల్ వివాహం జూన్ 6న జరగనుంది.
Key Points
నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
అఖిల్-జైనబ్ వివాహ పత్రికను సీఎంకు అందించారు.
అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ వేడుక జరుగుతుంది.
నాగార్జున దంపతుల సీఎం సందర్శనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని సినీనటుడు నాగార్జున (Nagarjuna) దంపతులు కలిశారు. ఇవాళ (శనివారం) ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లిన నాగ్ దంపతులు కుమారుడు అఖిల్ వివాహా వేడుకకు హాజరుకావాలని పెళ్లి పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.
నాగార్జున చిన్న కొడుకు (Akhil) అఖిల్, (Zainab) జైనబ్ల పెళ్లి జూన్ 6న జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వారి పెద్ద కుమారుడు (Naga Chaitanya) నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) వేదికగానే జరగనుందని సమాచారం. కాగా, గత కొంత కాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అనుమతితో గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత ఈ జంట పలుమార్లు నగరంలో సందడి చేశారు.
అఖిల్-జైనబ్ వివాహానికి ఆహ్వానం
వివాహ వేడుక విశేషాలు
నాగార్జున కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించడం విశేషం. జూన్ 6న జరిగే ఈ వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో వైభవంగా జరుగుతుందని సమాచారం.


