
నవరాత్రులు శుభకాలం. శని దోషం ఉన్నవారికి ఈ తొమ్మిది రోజులు విశేష పరిహారాలు చేయడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు. ఈ కథనంలో శని బాధల నుంచి బయటపడే సులభమైన పద్ధతులను తెలుసుకుందాం.
Key Points
నవరాత్రుల్లో కాళరాత్రి అమ్మవారిని పూజించండి.
దుర్గా సప్తశతి పఠనం చేయండి.
ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాన్ని జపించండి.
హనుమంతుని పూజించి, హనుమాన్ చాలీసా పఠించండి.
కాళరాత్రి అమ్మవారి పూజ
నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఉంటాము. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే నవరాత్రుల్లో కొన్ని పనులు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా నవరాత్రుల్లో కొన్ని పరిహారాలను పాటిస్తే శని దోషం నుంచి బయటపడవచ్చు.
ఈసారి నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలయ్యాయి, అక్టోబర్ 2 విజయదశమితో ముగుస్తాయి. అయితే నవరాత్రుల్లో శనికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చు, శని పెట్టే బాధల నుంచి బయటపడొచ్చు.
1.కాళరాత్రి అమ్మవారిని పూజించండి
దుర్గా సప్తశతి పఠనం & మంత్ర జపం
శని బాధల నుంచి బయటపడడానికి కాళరాత్రి అమ్మవారిని పూజించడం మంచిది. నవరాత్రుల్లో ఏడవ రోజు కాళరాత్రి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి, శని దేవుని అనుగ్రహం కలుగుతుంది, శని పెట్టే బాధలనుంచి బయటపడొచ్చు.
తొమ్మిది రోజులు కూడా దుర్గా సప్తశతిని పఠించండి. శని దోషాల నుంచి బయటపడడానికి, ఏలినాటి శని, అర్ధష్టమ శని బాధల నుంచి బయటపడొచ్చు. శని దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. అదే విధంగా ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన కూడా శని బాధల నుంచి బయటపడొచ్చు.
హనుమంతుని ఆరాధన
నవరాత్రుల్లో హనుమంతుడిని పూజించి, హనుమాన్ చాలీసాను చదువుకుంటే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. శని పెట్టే బాధల నుంచి బయటపడవచ్చు, సమస్యలన్నీ తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
నవరాత్రుల సమయంలో ఈ పరిహారాలను పాటించడం ద్వారా శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే, ఇవి సలహాలు మాత్రమే, నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.


