
ప్రముఖ మరాఠా నేత బాల్ ఠాక్రే మనవడు ఐశ్వర్య థాకరే హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నిశాంచి’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
Key Points
బాల్ ఠాక్రే మనవడు ఐశ్వర్య థాకరే హీరోగా డెబ్యూ
అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'నిశాంచి' సినిమా
యాక్షన్, రొమాన్స్, కామెడీతో కూడిన కథాంశం
ఐశ్వర్య థాకరే హీరోగా ఎంట్రీ
Nishaanchi : మరాఠా పాపులర్ రాజకీయ నేత దివంగత బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరి థాకరే హీరోగా ఎంటర్ ఇవ్వబోతున్నాడు. మొదటి సినిమాలోనే డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మాణంలో, ఫ్లిప్ ఫిల్మ్స్ సహకారంతో అనురాగ్ కహ్యాపీ దర్శకత్వంలో మరాఠీలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అమెజాన్ MGM స్టూడియో ఇండియా ద్వారా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.(Nishaanchi)
తాజాగా నిశాంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. 2000 సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఐశ్వరి థాకరేతో పాటు వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వం
నిశాంచి సినిమా విడుదల తేదీ
తాజాగా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అమెజాన్ MGM స్టూడియో డైరెక్టర్ నిఖిల్ మధోక్.. భారతీయ సినిమాలో తనదైన ముద్ర వేసిన అనురాగ్ కశ్యప్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. మీరు కూడా నిశాంచి ట్రైలర్ చూసేయండి..
మొత్తంగా, ‘నిశాంచి’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది. సెప్టెంబర్ 19న విడుదల కానున్న ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.

