|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR-Neel: మరోసారి అలియా భట్ తో ఎన్టీఆర్ జోడి! డ్రాగన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్!

Published: 14-04-2026, 8:35 AM
NTR-Neel: మరోసారి అలియా భట్ తో ఎన్టీఆర్ జోడి! డ్రాగన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్!
  • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీలో బాలీవుడ్ భామ అలియా భట్!
  • ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరోసారి ఎన్టీఆర్ సరసన అలియా మెరుపులు, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
  • విలన్ పాత్ర కోసం షాహిద్ కపూర్‌ను సంప్రదించిన మేకర్స్, భారీ యాక్షన్ సీన్స్ పక్కా!
  • 2026 ఎండింగ్‌లో ‘డ్రాగన్’ విడుదల, ఎన్టీఆర్ మాస్ వింటేజ్ ట్రీట్ రెడీ!

మాస్ కాంబోతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీతో వస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి వస్తున్న వార్తలు అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

డ్రాగన్ మూవీలో అలియా భట్ ఎంట్రీ..ఫ్యాన్స్ కి పండగే!

NtrNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియా భట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్(NtrNeel) సరసన అలియా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

విలన్‌గా షాహిద్ కపూర్.. ఎన్టీఆర్‌తో ఢీ అంటే ఢీ!

ఇప్పటికే డ్రాగన్ సినిమా మేకర్స్ ఆమెతో చర్చలు జరిపిందని, కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర గురించి కూడా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. తొలుత ఈ పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ టొవినో థామస్‌ను సంప్రదించినప్పటికీ, కాల్షీట్ల సర్దుబాటు కాకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ అండ్ ఎన్టీఆర్‌ మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉండే అవకాశం ఉంటుంది.

2026లో డ్రాగన్ రిలీజ్.. బాక్సాఫీస్ బద్దలే!

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2026 ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌తో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.