|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

34 గంటల్లో పోస్టింగులు! మెడికల్ ఆఫీసర్ల భర్తీకి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సంచలనం!

Published: 29-03-2026, 11:35 AM
34 గంటల్లో పోస్టింగులు! మెడికల్ ఆఫీసర్ల భర్తీకి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సంచలనం!
  • మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానం.
  • 34 గంటల్లోనే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం.
  • అభ్యర్థుల ఎంపిక ఆప్షన్ల ఆధారంగా జరుగుతుంది.
  • మొత్తం 611 వైద్యుల నియామక పోస్టింగులను ఆన్‌లైన్‌లో ఇవ్వనున్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనుంది. కేవలం 34 గంటల్లోనే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇది వైద్య నియామకాల్లో ఒక నూతన శకానికి నాంది కానుంది.

ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌తో పారదర్శక నియామకాలు

ప్రజారోగ్య శాఖ(డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్-డీహెచ్) ద్వారా మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని తొలిసారిగా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు ఎంపికైన వారికి అత్యంత పారదర్శక విధానంలో పోస్టింగ్ ఉత్తర్వులను ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పారు.

ఏపీ ఆన్లైన్ వారి సహకారంతో సోమవారం(మార్చి 30) నుంచి నిర్వహించబోతున్న కౌన్సెలింగ్ పోస్టింగ్ ఉత్తర్వుల జారీ 34 గంటల్లోగానే ముగుస్తుందని వెల్లడించారు. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షనకు అనుగుణంగా 611 వైద్యుల నియామక పోస్టింగు ఉత్తర్వులను ఆటోమేటిగ్‌గా ఆన్‌లైన్ ద్వారానే ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి(రిజర్వేషన్, ఇతర) అభ్యర్థులకు పోస్టింగులు ఇస్తామని తెలిపారు.

సాధారణంగా కౌన్సెలింగ్ కేంద్రాలకు అభ్యర్థులు వెళ్లి అక్కడ ప్రకటించిన వివరాల మేరకు పోస్టింగులు పొందారు. ఈ విధానంలో ఎక్కువ సమయం పడుతుంది. నిర్వహణ ఏర్పాట్లు పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది. ఈ విధానానికి భిన్నంగా.. అభ్యర్థులకు సానుకూలంగా ఉండేలా.. పారదర్శకత మరింత పెరిగేలా ఆన్లైన్ కౌన్సెలింగ్ జరగబోతుంది.

34 గంటల్లో పోస్టింగ్ ఉత్తర్వులు జారీ

ఆసుపత్రుల వారీగా ప్రకటించిన పోస్టులన్నింటికి ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు అప్షను ఇచ్చుకోవాల్సి ఉంది. ఇందులో ఎటువంటి పరిమితులు లేవు. దీనికి అనుగుణంగా అభ్యర్ధులు ఆప్షన్ల నమోదు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు, బోధనాసుపత్రుల్లో ట్యూటర్ల కేటగిరిల్లో కలిపి మొత్తం 638 పోస్టులకు ఎంపికచేసిన వారి జాబితాను ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నియామకాల బోర్డు ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం పలు పోస్టులు పెరిగాయి. ఇలా మొత్తం 638 పోస్టుల్లో 124 ట్యూటర్ల పోస్టులు ఉన్నాయి.

వెరిఫికేషన్ చేయాల్సి ఉన్నందున స్పోర్ట్స్ కోటా కింద ఉన్న పోస్టులు మినహాయించి, మిగిలిన 611 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి సోమవారం ఉదయం 11 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల మధ్య (మొత్తం 31 గంటలు) అప్షన్లు స్వీకరిస్తారు.

అభ్యర్థుల ఆప్షన్ల ప్రకారమే పోస్టింగులు

అనంతరం రెండు, మూడు గంటల వ్యవధిలో సదరు ఆసుపత్రుల పేర్లతో అభ్యర్థులు నమోదు చేసిన మొయిళ్లకు పోస్టింగు ఉత్తర్వులు ఆటోమేటిగ్గా వెళ్తాయి. పోస్టింగు ఉత్తర్వులు పొందిన వారు సదరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కార్యాలయాలు, బోధనాసుపత్రుల్లో 15 రోజుల్లోగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి తెలిపారు. సీహెచ్ఎఫ్ డబ్ల్యూ, డీఎంఈ, రిక్రూట్మెంటు బోర్డు వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు.

అభ్యర్థులకు సోమవారం ఉదయం 11 గంటల నుంచి వెబ్‌సైట్‌లో లాగిన్ https://aphfw-rec.aptonline.inకు అవకాశాన్ని కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానం ద్వారా నియామక ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.