
మరణించిన నటులను తెరపై మళ్లీ చూసే అవకాశం ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతోంది. కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘మారిగల్లు’ అనే ఓటీటీ సిరీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ వినూత్న ప్రయోగం గురించి మరిన్ని వివరాలు.
Key Points
కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ 'మారిగల్లు' ఓటీటీ సిరీస్లో కనిపించనున్నారు.
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో పునీత్ పాత్రను సృష్టించారు.
ఈ సిరీస్ జీ5 ఓటీటీలో జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
పునీత్ కుటుంబ సభ్యులే ఈ 'మారిగల్లు' సిరీస్ను నిర్మించారు.
ఏఐ టెక్నాలజీతో పునీత్ రాజ్ కుమార్ పునరాగమనం
ఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే.. జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్లు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి మరణించిన గాయనీగాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ని మళ్లీ తెరపై చూపించారు.
‘మారిగల్లు’ సిరీస్: కథా నేపథ్యం, ఓటీటీ వివరాలు
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమని సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఇతడు నటించిన పలు చిత్రాలు డబ్బింగ్గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగ గుడి అనే డాక్యుమెంటరీ రిలీజయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శకనిర్మాతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.
భవిష్యత్తులో ఏఐ ప్రయోగాలు, సినీ పరిశ్రమపై ప్రభావం
అయితే ‘మారిగల్లు’ అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్ని ఈ సిరీస్లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గానీ పునీత్కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం.
ఏఐ టెక్నాలజీతో పునీత్ రాజ్ కుమార్ లాంటి గొప్ప నటులను మళ్లీ తెరపై చూసే అవకాశం రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో ఇలాంటి వినూత్న ప్రయత్నాలు సినీ పరిశ్రమలో మరిన్ని చూడొచ్చు.


