
ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టువం’ సినిమా షూటింగ్ సమయంలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ మృతి చెందారు. కార్ ఛేజింగ్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Key Points
పా. రంజిత్ దర్శకత్వంలోని 'వెట్టువం' సినిమా షూటింగ్లో విషాదం.
ప్రముఖ స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ కన్నుమూత.
కార్ ఛేజింగ్ సీన్ షూటింగ్ సమయంలో ప్రమాదం సంభవించింది.
మొదట గుండెపోటుతో మరణించినట్లు తెలిపినా, వీడియోలో వేరే విషయం బయటపడింది.
వెట్టువం సినిమా సెట్లో విషాదం
సినిమా షూటింగ్స్ లో విపత్తులు తరచుగా జరుగుతున్నాయి. ఇప్పుడు పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఇటీవల సినిమా సెట్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న `వెట్టువం` మూవీ సెట్లో స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ కన్నుమూశారు.
దర్శకుడు పా రంజిత్ `అట్టకత్తి` చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. `మద్రాస్` , సూపర్ స్టార్ రజనీకాంత్ తో `కబాలి`, `కాలా `చిత్రాలను దర్శకత్వం వహించి దర్శకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ మృతి
రీసెంట్ గా `తంగలాన్` సినిమా తీసిన రంజిత్, ఇప్పుడు `వెట్టువం` సినిమా తీస్తున్నారు. ఆర్య, అట్టకతి దినేష్, కలైయరసన్ వంటి నటులు నటిస్తున్న ఈ సినిమాను నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
నాగపట్నం జిల్లాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో సీనియర్ స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ (52) కన్నుమూశారు. కార్ ఛేజింగ్కి సంబంధించిన స్టంట్స్ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో రాజ్ మృతి చెందడం విచారకరం.
కార్ ఛేజింగ్ సీన్ షూటింగ్ సమయంలో ప్రమాదం
అయితే మొదట చిత్రం బృందం మోహన్ రాజా గుండెపోటుతో మరణించినట్టు తెలిపింది. స్టంట్ చేసే క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, దీంతో ఆసుపత్రికి తరలించారని, కానీ ఆసుపత్రికి వెళ్లే లోపు ఆయన మరణించినట్టు తెలిపారు.
కానీ వీడియోలో వేరేలా ఉంది. ఈ వీడియోలో కార్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్నారు. రోప్ పై నుంచి కారు వెళ్లి బోల్తా కొట్టింది. సీన్ ముగిసిన వెంటనే టీమ్ ప్రమాదం వద్దకు వెళ్లి చూడగా, ఆయన మృతి చెందినట్టు తెలిసింది.
ఈ సంఘటన సినీ పరిశ్రమకు ఓ తీరని లోటు. మోహన్ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.


