
పాపాంకుశ ఏకాదశి దసరా మరుసటి రోజు ఆశ్వయుజ శుక్లపక్షంలో వస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 3న శ్రావణ-ధనిష్ట నక్షత్రాల అరుదైన కలయికతో ఈ ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును లక్ష్మీదేవితో పూజించి, ఉపవాసం ఉండటం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి సంతోషం, మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
Key Points
దసరా మరుసటి రోజున పాపాంకుశ ఏకాదశి జరుపుకుంటారు.
ఈ ఏడాది అక్టోబర్ 3న శ్రావణ, ధనిష్ట నక్షత్రాల కలయికతో ఏకాదశి.
విష్ణువును లక్ష్మీదేవితో ఆరాధించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.
ఉపవాసం ఉండి మంత్రాలు జపించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి, మోక్షం లభిస్తుంది.
పాపాంకుశ ఏకాదశి ముహూర్తం, విశిష్టత
పాపాంకుశ ఏకాదశి ముహూర్తం: దసరా మరుసటి రోజున పాపాంకుశ ఏకాదశి జరుపుకుంటారు. ప్రతీ ఏటా పాపంకుశ ఏకాదశి ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో వస్తుంది. ఈ ఏడాది ఇది అక్టోబర్ 3న వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉంటే ఎంతో గొప్ప ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి నాడు భక్తితో విష్ణువు ని ఆరాధించి, ఉపవాసం ఉంటే పాపాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండచ్చు.
ఏకాదశి తిథి అక్టోబర్ 2 రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది, కానీ ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి కనుక పాపాంకుశ ఏకాదశిని అక్టోబర్ 3న జరుపుకోవాలి. ఈ రోజున, శ్రావణ నక్షత్రంతో ధనిష్ట నక్షత్రం కలయిక వుంది. అంతే కాకుండా, ధృతి యోగం రాత్రి 09:45 గంటల వరకు ఉంటుంది.
ఈ రోజున, విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది.
కుడివైపున శంఖం పెట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ని అభిషేకించండి.
కుంకుమపువ్వును పాలలో కలిపి శంఖంలో నింపి స్వామికి అభిషేకం చేయాలి.
ఈ రోజున అన్ని కోరికలను సాధించడానికి మానవులకు స్వర్గం, మోక్షాన్ని అందించే పద్మనాభ స్వామిని ఆరాధించాలని పద్మ పురాణంలో చెప్పబడింది.
ఈ రోజున ఉపవాసం చేయడం ద్వారా, అన్ని పాపాలు తొలగిపోతాయి.
విష్ణు-లక్ష్మీ ఆరాధన విధానం
ఋషి చాలా కాలం పాటు కఠినమైన తపస్సు చేయడం ద్వారా పొందే ఫలం ఆ రోజున గరుడుడికి నమస్కరించడం ద్వారా పొందవచ్చు.
భూమిపై ఎన్ని తీర్థయాత్రలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఒక వ్యక్తి విష్ణుమూర్తి నామాన్ని స్మరించడం ద్వారా వాటిని దర్శించుకున్నంత ఫలితాన్ని పొందుతాడు. సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ఈ మంత్రాలను జపిస్తే మంచిది
3.శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్..
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం
పాప విమోచన మంత్రాలు
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్..
4.మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుణధ్వజః
మంగళం పుండరీ కక్షః మంగలాయ తనో హరిః
5.త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ..
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మం దేవా..
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పాపాంకుశ ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించి, ఉపవాసం ఉండటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విశేషమైన రోజున మంత్రాలను జపించి, స్వామి కృపకు పాత్రులు కండి.


