
జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రియదర్శి పులికొండ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాతి రత్నాలు 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆ సినిమాలో నటించనని స్పష్టం చేస్తూనే, తన కొత్త చిత్రం మిత్రమండలి విశేషాలను పంచుకున్నారు. ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Key Points
జాతి రత్నాలు 2లో నటించనని ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రియదర్శి నటించిన కొత్త సినిమా మిత్రమండలి ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది.
మిత్రమండలి అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది, ప్రియదర్శితో పాటు విష్ణు, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు.
జాతి రత్నాలు సినిమా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యిందని, అది ఒక క్లాసిక్ అని ప్రియదర్శి అన్నారు.
జాతి రత్నాలు-2 పై ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్
ప్రియదర్శి పులికొండ, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం జాతి రత్నాలు . ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది . చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది . అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది . అప్పట్లో ఓవర్ సీస్ లోనూ వన్ మిలియన్ డాలర్ల మార్క్ను దాటిన చిత్రంగా ఘనత సాధించింది .
తాజాగా ప్రియదర్శి మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . మిత్రమండలి సినిమాతో మరోసారి జాతిరత్నాల్లాంటి ఎంటర్ టైన్ అందించేందుకు సిద్ధమయ్యారు . ఇవాళ ట్రైలర్ విడుదల చేయగా విపరీతంగా నవ్వులు తెప్పిస్తోంది . ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి జాతిరత్నాలు సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు .
మిత్రమండలి: ప్రియదర్శి కొత్త సినిమా విశేషాలు
ఆ టైమ్ లో వచ్చిన జాతి రత్నాలు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యిందని ప్రియదర్శి అన్నారు . జాతిరత్నాలు సినిమాకు , మిత్రమండలికి చాలా వేరియషన్ ఉంటుందన్నారు . ఒకవేళ ఇప్పుడు కనుగ జాతిరత్నాలు -2 తీస్తే నేను మాత్రం అస్సలు చేయనని ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్ చేశారు . అలాంటి క్లాసిక్ సినిమాను మళ్లీ తీయొచ్చేమో కానీ .. నేను మాత్రం నటించనని స్పష్టం చేశారు .
జాతి రత్నాలు విజయ రహస్యం.. ప్రియదర్శి మాటల్లో
కాగా .. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియదర్శితో పాటు విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన మిత్రమండలి అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది.
జాతి రత్నాలు లాంటి క్లాసిక్ను మళ్లీ తీయడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రియదర్శి తదుపరి చిత్రం మిత్రమండలి ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి. ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకు చేరుకుంటుందో అక్టోబర్ 16న తెలుస్తుంది.


