
📌 Key Points
- తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
- కాంతారావు అవార్డు నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తికి ప్రదానం.
- సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న నారాయణమూర్తి.
- ఏపీలో నంది అవార్డులు ఇవ్వాలని చంద్రబాబుకు నారాయణమూర్తి విజ్ఞప్తి.
టాలీవుడ్లో మరో సంచలనం! ఆర్ నారాయణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారికి దండం పెడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
గత 13 ఏళ్లుగా నంది అవార్డుల కోసం ఎదురుచూపులు
R Narayana Murthy : నేడు మార్చ్ 19న ఉగాది సందర్భంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను ఇటీవల ఈ గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఈ ఈవెంట్ కి భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్ చెప్పిన నారాయణమూర్తి
ఈ అవార్డుల్లో కాంతారావు అవార్డు నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తికి ప్రకటించగా నేడు సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డుని అందించారు.
తెలుగు పరిశ్రమను గౌరవించాలని విజ్ఞప్తి
అవార్డు అందుకున్న అనంతరం ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా నంది అవార్డులు ఎప్పుడు ఇస్తారు అని ఎదురుచూసాము. కానీ ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నందుకు హ్యాట్సాఫ్. తెలంగాణ నుంచి వచ్చిన నటుల్లో కాంతారావు ముందు ఉన్నారు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లకు పోటీగా ఉన్న హీరో కాంతారావు. తెలంగాణ బిడ్డ తాడేపల్లి లక్ష్మి కాంతారావు. ఆయన అవార్డు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సమయంలో అడుగుతున్నా సీఎం చంద్రబాబు గారు మీకు దండం పెడుతున్నా ఇక్కడ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు, ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నారు. ఏపీలో కూడా నంది అవార్డులు ఇవ్వండి. తెలుగు పరిశ్రమని గుర్తించి గౌరవించండి, పరిశ్రమని ఎంకరేజ్ చేయండి అని అన్నారు.
ఆర్ నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ వార్త టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.


