|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజాసాబ్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే! టికెట్ ధరలు పెంచేస్తూ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

Published: 08-01-2026, 9:30 PM
రాజాసాబ్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే! టికెట్ ధరలు పెంచేస్తూ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
  • రాజాసాబ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి జీవో జారీ చేసింది!
  • సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి!
  • జనవరి 9 నుంచి 11 వరకు పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి, ఆ తర్వాత రేట్లు మారుతాయి.
  • మారుతి దర్శకత్వంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇక థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

రాజాసాబ్ మూవీకి తెలంగాణాలో భారీగా టికెట్ ధరల పెంపు

The Rajasaab: ది రాజసాబ్ మూవీ మేకర్స్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘ది రాజా సాబ్(The Rajasaab)’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం రాజాసాబ్ సినిమా శుక్రవారం రిలీజ్ అవ్వాలి. కానీ, ఒకరోజు ముందే అంటే గురువారం రాత్రి నుంచే ప్రీమియర్స్ వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు నిర్మాతలు.

కానీ, ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అది కూడా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. శుక్రవారం జనవరి 9 నుంచి జనవరి 11వ తేదీ వరకు మూడు రోజులపాటు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 రూపాయలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు ఎంతంటే?

అలాగే జనవరి 12వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.62, మల్టీప్లెక్స్‌లో రూ.89 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ టికెట్లు పెంపు వల్ల వచ్చిన లాభంలో 20% ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. దీంతో, ప్రభుత్వం అందించిన సహకారానికి మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మూడు రోజుల పాటు పెరిగిన ధరలు.. ఆ తరువాత మళ్ళీ మార్పులు!

ఇక దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ హారర్ అండ్ థ్రిల్లర్‌ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటించారు.

ప్రభుత్వం అందించిన సహకారానికి మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజాసాబ్ మూవీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మన ప్రభాస్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.