
సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోలు ఇప్పుడు యువ దర్శకులతో ఎక్కువగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Key Points
రజినీకాంత్ తరువాతి సినిమా తెలుగు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉంది.
వివేక్ ఆత్రేయ 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి సినిమాల ద్వారా పేరు తెచ్చుకున్నారు.
రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ' మరియు 'జైలర్ 2' చిత్రాలలో నటిస్తున్నారు.
ఈ సహకారం వివేక్ ఆత్రేయకు ఒక పెద్ద అవకాశం, రజినీకాంత్ కు కూడా కొత్త అనుభవం.
రజినీకాంత్ మరియు వివేక్ ఆత్రేయ సహకారం?
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.
వివేక్ ఆత్రేయ చిత్రకర్మం
ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న ‘జైలర్ 2’ కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.
2017లో ‘మెంటల్ మదిలో’ అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత ‘బ్రోచేవారెవరురా’ తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.
రజినీకాంత్ తరువాతి ప్రాజెక్టులు
రజినీకాంత్ మరియు వివేక్ ఆత్రేయల సహకారం టాలీవుడ్ లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఈ సినిమా విజయవంతం అయితే ఇద్దరికీ మంచి పేరు వస్తుంది.

