
తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేశారు. ‘మిరాయ్’ సినిమాపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాహుబలి తర్వాత ఇంతటి ప్రశంసలు అందుకున్న చిత్రం ఇదే అని ఆయన అభిప్రాయపడ్డారు.
Key Points
మిరాయ్ సినిమాకు రాం గోపాల్ వర్మ ప్రశంసలు.
బాహుబలి తర్వాత ఇంతటి ప్రశంసలు వచ్చిన సినిమా ఇదే అని ఆర్జీవీ అభిప్రాయం.
తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్లకు ఆర్జీవీ అభినందనలు.
సినిమా కథనం, VFX హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ఆర్జీవీ అభిమానం.
మిరాయ్ సినిమా విడుదల
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్జీవీ ట్వీట్
బాహుబలితో పోలిక
చివరగా, మిరాయ్ సినిమా విజయంపై రాం గోపాల్ వర్మ అభినందనలు తెలిపారు. బాహుబలి తర్వాత ఇంతటి ప్రశంసలు అందుకున్న సినిమా ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.


