
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు ఆగస్టు 11న విచారణకు హాజరు కావాల్సి ఉంది. గతంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఆలస్యం చేశారు.
Key Points
రానా దగ్గుబాటికి ఈడీ నుండి మరోసారి నోటీసులు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు.
ఈడీ విచారణకు రానా హాజరు?
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా.. నేడు (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇతడికి గతంలోనే ఓసారి నోటిసులు ఇస్తే.. తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు చెప్పాడు. ఈడీని కాస్త సమయం కోరాడు. దీంతో రానాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు
ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు. మరి రానా ఈరోజు విచారణకు హాజరవుతాడా లేదా అనేది చూడాలి? అలానే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది.
ఇతర హీరోల విచారణ
రానా ఈడీ విచారణకు హాజరవుతారో లేదో చూడాలి. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. ఈ ఘటన టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.


