
‘కుబేర’ చిత్ర ప్రమోషన్ ఈవెంట్లో రష్మిక మందన్న పాల్గొని, నాగార్జునతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
Key Points
రష్మిక మందన్న 'కుబేర' చిత్ర ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొంది.
నాగార్జునతో ఉన్న ఫోటోను రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది.
నాగార్జున కాళ్ళ దగ్గర కూర్చుని రష్మిక మాట్లాడటాన్ని నెటిజన్లు ప్రశంసించారు.
రష్మిక సింపులిసిటీ, పెద్దలకు గౌరవం చూపించడం నెటిజన్లను ఆకట్టుకుంది.
‘కుబేర’ చిత్ర ప్రమోషన్ ఈవెంట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఈ క్రమంలో రీసెంట్గా కుబేర టీం చెన్నైలో ఓ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసింది. ఆ ఈవెంట్లో తాను చాలా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేసింది రష్మిక. తన చిన్నతనాన్ని గడిపిన చెన్నైలో ఈ ఈవెంట్ జరగడం ఒకెత్తైతే.. ఈ ఈవెంట్లో కింగ్ నాగ్, ధనుష్తో క్యాండిడ్ మూమెంట్స్ను పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. అలాగే కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. అయితే ఓ పిక్ నెట్టింట అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
నాగార్జునతో ఉన్న ఫోటో
ఆ పిక్ స్పెషాలిటీ ఏంటంటే.. కింగ్ నాగార్జున రష్మికకి ఏదో చెబుతుంటే… ఆయాన కాళ్ల దగ్గర కూర్చుని రష్మిక వింటుంది. ఇంత ఎదిగిన కూడా రష్మిక సింప్లిసిటీ.. పెద్దలకు గౌరవించడం చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల ప్రతిస్పందన
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)
రష్మిక మందన్న సరళత, పెద్దల పట్ల గౌరవం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘కుబేర’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


