
టాలీవుడ్లోని ప్రముఖ జంట రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండల న్యూయార్క్ పరేడ్ లోని వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీరిద్దరి సన్నిహితతను చూసి నెటిజన్లు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలా అంటున్నారు.
Key Points
రష్మిక-విజయ్ జంట న్యూయార్క్లోని స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో పాల్గొన్నారు.
వారి సన్నిహితతను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నెటిజన్లు వారిని కొత్తగా పెళ్ళైన జంటలా అంటున్నారు.
ఈ జంట యొక్క కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
న్యూయార్క్ పరేడ్ లో రష్మిక, విజయ్
టాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా పేరున్న జంట రష్మిక మందన్నా , విజయ్ దేవరకొండ . కొన్నేళ్లుగా వీరిద్దరిపై చాలా సార్లు డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి . కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు . అయినప్పటికీ వీరిద్దరు చాలాసార్లు వేకేషన్స్ , ఫెస్టివల్స్ లో సందడి చేస్తూ కనిపించారు . సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు , వీడియోలతో నెటిజన్లకు ఈజీగా దొరికిపోవటం వీరిద్దరి స్పెషాలిటీ .
వైరల్ అవుతున్న వీడియో
తాజాగా ఈ జంట ఓకే వేదికపై అఫీషియల్ గా మెరిశారు . అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించిన 79 వ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ లో సందడి చేశారు . అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు . దీనికి సంబంధించిన వీడియోలు , ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి . ఇది చూసిన నెటిజన్స్ మరోసారి క్రేజీ కామెంట్స్ చేశారు .
నెటిజన్ల కామెంట్లు
అయితే ఈ పరేడ్ కు సంబంధించిన మరో వీడియో నెట్టంట వైరల్ గా మారింది . రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ షేర్ చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మరింత సన్నిహితంగా కనిపించారు . పెన్నుతో విజయ్ దేవరకొండను పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . ఇది చూసిన ఫ్యాన్స్ వీరిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వధూవరుల మాదిరి కనిపిస్తున్నారంటూ ట్విటర్ లో రాసుకొచ్చారు . ఈ జంటను కెమిస్ట్రీ న్యూ వెడ్డింగ్ కపుల్ వైబ్ ను తలపిస్తోందంటూ పోస్ట్ చేశారు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది .
రష్మిక మరియు విజయ్ ల మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ అభిమానులను మరింత ఆకర్షిస్తోంది. వారి వైరల్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


