
📌 Key Points
- రథసప్తమి నాడు సూర్యారాధన చేస్తే సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది.
- జాతకంలో సూర్యుడి స్థానం బలపడాలంటే ఉప్పు తినకూడదు, ఉప్పు దానం చేయడం ఉత్తమం.
- ఆదిత్య హృదయ స్తోత్రం, గజేంద్ర మోక్షం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
- రాగి పాత్రలో నీటిని నింపి ఎర్రటి పుష్పాలతో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే అదృష్టం పెరుగుతుంది.
రథసప్తమి హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, మరియు కీర్తి లభిస్తాయని నమ్ముతారు.
రథసప్తమి విశిష్టత మరియు ప్రాముఖ్యత
చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉన్నట్లయితే సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అలాగే అందరికంటే ముందు ఉండొచ్చు. ఏ కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే, రథసప్తమి వేళ ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలి?
రథసప్తమి చాలా విశేషమైన రోజు. రథసప్తమి పండుగ నాడు సూర్యభగవానుని భక్తితో ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉన్నట్లయితే సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అలాగే అందరికంటే ముందు ఉండొచ్చు. ఏ కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే, రథసప్తమి వేళ ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలి? రథసప్తమి నాడు సూర్యుడి అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి వాటిని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మాఘమాసం + రథసప్తమి + ఆదివారం +సూర్య జయంతి + 2+5=7
జిల్లేడు ఆకులు, రేగిపండ్లు
రథసప్తమి నాడు వీటిని పాటిస్తే మంచిది
సూర్య భగవానుని అనుగ్రహం ఎలా పొందాలి?
ఈ విధంగా పాటిస్తే ఆరోగ్యం కలుగుతుంది. దీర్ఘాయుష్షు, సంపదలను కూడా పొందడానికి వీలవుతుంది.
రథసప్తమి నాడు ఈ పరిహారాలను పాటించడం మంచిది
రథసప్తమి నాడు జాతకంలో సూర్య స్థానం బలపడాలంటే ఆ రోజున ఉప్పు తినకూడదని అంటారు. అలాగే ఉప్పును దానం చేయడం కూడా చాలా మంచిది.
పారే నీటిలో లేదా నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
అలాగే బెల్లం, ఆవు నెయ్యితో పరమాన్నం చేసి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.
రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు
ఆ రోజు దానధర్మాలు చేస్తే కూడా విశేషమైన ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.
ఉపవాసం ఉండి కేవలం పండ్లు తింటే, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.
రథసప్తమి నాడు ఆదిత్య హృదయ స్తోత్రం, గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
రథసప్తమి నాడు రాగి పాత్రలో నీటిని నింపి, ఎర్రటి పుష్పాలను అందులో వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే అదృష్టం పెరుగుతుంది. శత్రువులపై కూడా విజయాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే రథసప్తమి నాడు మట్టికుండలో పాలను పెట్టి, వాటిని వేడి చేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాల్లో కొంతసేపు ఉంచాలి. దాంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవి కి, సూర్యుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.
రథసప్తమి నాడు సూర్య భగవానుని ఆరాధించి, ఆయన కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. సూర్యదేవుని అనుగ్రహంతో మీ జీవితం సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము. శుభం భూయాత్!


