
📌 Key Points
- సందీప్ కిషన్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా ఫిక్స్!
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ చిత్రం!
- పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘పవర్ పేట’లో సందీప్, రితికా జోడీ అదుర్స్!
- ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ నుండి ‘మిరాయ్’ వరకు రితికా జైత్రయాత్ర!
టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి సినిమాలో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్తో కలిసి నటించనున్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సందీప్, రితికా జోడీతో పవర్ పేట దుమ్మురేపుతోంది!
‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రితికా నాయక్.. హాయ్ నాన్న మూవీలో క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిరాయ్తో ఒక్కసారిగా క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అందం, అభినయంతో కుర్రాళ్లను సైతం ఆకట్టుకుని బిగ్ సక్సెస్ అందుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం డ్యూయెట్, కొరియన్ కనకరాజు మూవీస్లో నటిస్తున్నారు. ఇప్పుడు మరో ఆఫర్ అందుకుంది రితికా. టాలీవుడ్, కోలీవుడ్లో వరుస ప్రాజెక్టులు చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఈ ఏడాది పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘పవర్ పేట’తో రాబోతున్నాడు. ఈ మూవీలో సందీప్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు టాక్. దీనికి రౌడీ ఫెలో, చల్ మోహన్రంగ్ మూవీస్ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా… 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.
మిరాయ్ బ్యూటీకి టాలీవుడ్లో వరుస ఆఫర్లు!
కృష్ణ చైతన్య దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామా!
రితికా నాయక్, సందీప్ కిషన్ కాంబినేషన్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


